పౌరసత్వ చట్టానికి ఏకకాలంలో ‘ సెగ ‘.. 10 నగరాల్లో ప్రదర్శనలు.. అయితే…

కొత్త పౌరసత్వ చట్టానికి నిరసనగా ఒకేసారి దేశంలోని 10 నగరాల్లో గురువారం ప్రదర్శనలు నిర్వహించాలని విద్యార్థులు, ప్రజలు యోచిస్తున్నారు. ఢిల్లీ, లక్నో, బెంగుళూరు తదితర సిటీల్లో వీటి నిర్వహణకు ప్లాన్ చేశారు. అయితే పోలీసులు మాత్రం ఇందుకు ‘ నో ‘ అంటున్నారు. వీటికి అనుమతినిచ్ఛే ప్రసక్తే లేదంటున్నారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, పూణే, నాగపూర్, భువనేశ్వర్, కోల్ కతా, భోపాల్ నగరాల్లో ఎలాంటి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరగరాదంటూ ఆంక్షలు విధించారు. హస్తినలో ప్రొటెస్ట్ ర్యాలీని […]

పౌరసత్వ చట్టానికి ఏకకాలంలో ' సెగ '.. 10 నగరాల్లో ప్రదర్శనలు.. అయితే...
Follow us

|

Updated on: Dec 19, 2019 | 10:50 AM

కొత్త పౌరసత్వ చట్టానికి నిరసనగా ఒకేసారి దేశంలోని 10 నగరాల్లో గురువారం ప్రదర్శనలు నిర్వహించాలని విద్యార్థులు, ప్రజలు యోచిస్తున్నారు. ఢిల్లీ, లక్నో, బెంగుళూరు తదితర సిటీల్లో వీటి నిర్వహణకు ప్లాన్ చేశారు. అయితే పోలీసులు మాత్రం ఇందుకు ‘ నో ‘ అంటున్నారు. వీటికి అనుమతినిచ్ఛే ప్రసక్తే లేదంటున్నారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, పూణే, నాగపూర్, భువనేశ్వర్, కోల్ కతా, భోపాల్ నగరాల్లో ఎలాంటి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరగరాదంటూ ఆంక్షలు విధించారు. హస్తినలో ప్రొటెస్ట్ ర్యాలీని రెడ్ ఫోర్ట్ నుంచి నిర్వహించాలని నిర్ణయించుకోగా.. ఇందుకు తాము అనుమతించబోమని ఖాకీలు ఓ లేఖ ద్వారా తెలిపారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ దృష్ట్యా తాము పర్మిషన్ ఇవ్వడంలేదన్నారు. అయితే నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. తాము ఈ దేశ ప్రజలమని, నిరసన ప్రదర్శన నిర్వహించి తీరుతామని అంటూ సోషల్ మీడియా ద్వారా మెసేజులు పంపారు.

బెంగుళూరులో ఉదయం పది గంటలకు ప్రదర్శన ప్రారంభించాలన్న నిరసనకారుల ప్లాన్ కు పోలీసులు మోకాలడ్డారు. తాము ఇందుకు అనుమతించబోమని పోలీస్ కమిషనర్ భాస్కరరావు స్పష్టం చేశారు. అలాగే.. యూపీలో అనేకప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలకు పర్మిషన్ లేదని ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. భువనేశ్వర్ లో ఉదయం 10గంటలకు, భోపాల్ లో మధ్యాహ్నం 2 గంటలకు, చెన్నైలో మధ్యాహ్నం మూడింటికి, హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటలకు, పూణేలో సాయంత్రం నాలుగున్నర గంటలకు ర్యాలీలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. కోల్ కతాలో సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యాన నిరసన ప్రదర్శన జరగనుంది. కేరళ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించారు.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్