Digital India: డిజిటల్‌ ఇండియా ఆరేళ్ల సంబరాలు.. వర్చువల్ మీటింగ్‌లో ప్రధానితో చిన్నారి చిట్ చాట్

డిజిటల్‌ ఇండియా ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులతో ఇంటరాక్ట్‌ అయ్యారు ప్రధాని మోడీ. వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్‌ ఇండియాకు సంబంధించి వేర్వేరు..

Digital India: డిజిటల్‌ ఇండియా ఆరేళ్ల సంబరాలు.. వర్చువల్ మీటింగ్‌లో ప్రధానితో చిన్నారి చిట్ చాట్
Pm Modi To Interact With Be

Updated on: Jul 01, 2021 | 1:13 PM

డిజిటల్‌ ఇండియా ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులతో ఇంటరాక్ట్‌ అయ్యారు ప్రధాని మోడీ. వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్‌ ఇండియాకు సంబంధించి వేర్వేరు స్కీమ్స్‌లో విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన సుహానీ సాహు,   దీక్ష అనే లబ్ధిదారులతో ప్రధాని ముచ్చటించారు.

5 వ తరగతి చదువుతున్న విద్యార్థి సుహానీ సాహు తన అధ్యయనాల వివరాలను ప్రధానితో పంచుకున్నారు. సుహానీ సాహు మాట్లాడుతూ…  “మేము వాట్సాప్‌లో ఒక లింక్‌ను అందుకుంన్నాము. అక్కడ మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. ప్లాట్‌ఫారమ్‌లో చాలా కార్టూన్లు కూడా ఉన్నాయి” అని చిన్నారు ప్రధానితో వివరించారు.

ఈ ఆరేళ్ల కాలంలో టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కేంద్రం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు ప్రధాని మోదీ. సాంకేతికత సాధికారతలో డిజిటల్​ ఇండియాది కీలక పాత్ర అని తెలిపారు.

డిజిటల్​ ఇండియా సాధించిన విజయాలు, ఫ్యూచర్‌ ప్లాన్‌ గురించి వివరించారు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌. ప్రభుత్వానికి ప్రజలను దగ్గర చేయడంలో డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందన్నారు.

డిజిటల్ ఇండియాకు ఆధారంగా నిలిచే తొమ్మిది స్తంభాలను గుర్తించి, అభివృద్ధి  చేస్తోంది. అవి ఏమిటంటే…

– బ్రాడ్‌బ్యాండ్ హైవేస్

– సార్వజనీన మొబైల్ కనెక్టివిటీ లభ్యత

– పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్

– ఎలక్ట్రానిక్స్ తయారీ

– ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్స్ (స్వల్ప కాలంలో పూర్తి కావలసిన పథకాలు)

– ఈ-పరిపాలన – సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వ సంస్కరణలు

– ఈ-క్రాంతి – ఎలక్ట్రానిక్ విధానంలో సేవల బట్వాడా

– అందరికీ సమాచారం

– ఉద్యోగాల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

ఇవి కూడా చదవండి: Anti-Drone System: జమ్ముకశ్మీర్‌లో డ్రోన్‌ టెర్రర్‌‌కు చెక్.. ఎయిర్‌బేస్‌పై యాంటీ డ్రోన్‌ జామర్లు

Warangal Chai Wala: మహ్మద్‌ పాషాతో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని మోడీ.. ‘మన్ కీ బాత్’లో వరంగల్ చాయ్ వాలా