Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PK meets Nitish: ప్రశాంత్‌ కిషోర్‌, నితీష్‌ కుమార్‌ రహస్య భేటీ.. సర్‌ప్రైజ్‌ డిన్నర్‌ వెనుక కారణం ఇదేనా!

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య రహస్య సమావేశం జరిగింది. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌తో ప్రశాంత్ కిషోర్ తెగతెంపులు చేసుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకంది.

PK meets Nitish: ప్రశాంత్‌ కిషోర్‌, నితీష్‌ కుమార్‌ రహస్య భేటీ.. సర్‌ప్రైజ్‌ డిన్నర్‌ వెనుక కారణం ఇదేనా!
Pk Meets Nitish
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 19, 2022 | 7:19 PM

Prashant Kishor meets Bihar CM Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య రహస్య సమావేశం జరిగింది. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌(TMC)తో ప్రశాంత్ కిషోర్ తెగతెంపులు చేసుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకంది. నితీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్ శుక్రవారం సాయంత్రం విందు రాజకీయాలు జరిపినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్‌తో భేటీ గురించి బీహార్ సీఎం నితీష్ కుమార్‌ను ప్రశ్నించగా, ఈరోజు నుంచి ప్రశాంత్ కిషోర్‌తో నా బంధమా? సమావేశం వెనుక నిర్దిష్ట ఉద్దేశ్యం ఏమిలేదని కొట్టిపారేశారు.

వాస్తవానికి రెండు రోజులకు గానూ బీహార్ సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో చాలా మంది ప్రముఖులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ తన పాత స్నేహితుడు ప్రశాంత్ కిషోర్‌తోనూ భేటీ అయ్యారు. సర్ ప్రైజ్ డిన్నర్‌కు సంబంధించి నితీష్ కుమార్ కిషోర్ తో తన భేటీ సాధారణ విషయమని స్పష్టం చేశారు. నితీష్‌ కుమార్‌తో ప్రకటనలు గుప్పించిన తర్వాతే ప్రశాంత్‌కిషోర్‌ జేడీయూ నుంచి విడిపోయినా.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భేటీలో అనేక అర్థాలు వెలికి తీస్తున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ కొత్త సమీకరణాన్ని సృష్టించాలనుకుంటున్నారని కూడా ప్రశాంత్ కిషోర్‌తో సీఎం నితీశ్ భేటీ కావడం రాజకీయ కారిడార్‌లలో చర్చనీయాంశమైంది. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఉన్నారు. అతను గత కొన్ని నెలలుగా చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులను కూడా కలిశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించవచ్చని, అయితే అందుకు మంచి వ్యూహం రూపొందించాలని ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విపక్షాలకు సూచించారు.

మరోవైపు, జార్ఖండ్‌లో తలెత్తిన భోజ్‌పురి మగాహి వివాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ, భోజ్‌పురి, మగాహి ఒకే రాష్ట్రానికి చెందినవా? యూపీలో కూడా భోజ్‌పురి మాట్లాడతారు. బీహార్-జార్ఖండ్‌లో కూడా ఈ భాష అందరికీ సంబంధించినది. నాకు అద్భుతంగా అనిపిస్తోంది. ఎవరైనా ఇలా చేస్తుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నట్టు అనిపించదు. ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదంటూ నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షాల నుండి తీవ్ర ఒత్తిడితో, జార్ఖండ్ ప్రభుత్వం శుక్రవారం నాడు జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (జార్ఖండ్ SSC) మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ స్థాయి పోటీ పరీక్షలలో జిల్లా స్థాయి పోస్టులకు ప్రాంతీయ/గిరిజన భాషల జాబితాలో మగాహి, అంజికా, భోజ్‌పురిలను చేర్చింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 24న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. గర్వా, చత్రా జిల్లాలు. భాషా పరీక్షల జాబితాలో మగాహి,భోజ్‌పురి కూడా చేర్చారు.

Read Also… UP Elections: బుందేల్‌ఖండ్‌పై మూడు పార్టీల కన్ను.. పూర్వ వైభవం కోసం బీఎస్పీ ‘మాయ’జాలం!