వాజ్ పేయికి ప్రధాని మోదీ ఘన నివాళి

| Edited By: Pardhasaradhi Peri

Aug 16, 2020 | 9:31 AM

దివంగత మాజీ ప్రధాని ఏబీ వాజ్ పేయి రెండో వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. పుణ్య తిథి రోజున ఆయన కన్ను మూశారని, ఈ దేశ అభ్యున్నతికి, చేసిన..

వాజ్ పేయికి ప్రధాని మోదీ ఘన నివాళి
Follow us on

దివంగత మాజీ ప్రధాని ఏబీ వాజ్ పేయి రెండో వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. పుణ్య తిథి రోజున ఆయన కన్ను మూశారని, ఈ దేశ అభ్యున్నతికి, చేసిన సేవలకు స్మృతి చిహ్నంగా ఆయనను స్మరించుకుంటున్నామని మోదీ పేర్కొన్నారు. వాజ్ పేయికి సంబంధించిన ఫొటోలతో కూడిన సుమారు రెండు నిముషాల మోంటేజీని మోదీ విడుదల చేశారు. ఈ దేశం మీ త్యాగ నిరతిని ఎన్నటికీ మరువబోదని, మీ హయాంలో ఇండియా అణు శక్తిగా ఎదిగిందని ఆయన అన్నారు. రాజకీయ వేత్తగా, ఎంపీగా, ప్రధానిగా మీరు ఈ దేశానికి అమూల్యమైన సేవలను అందించారని అన్నారు. తను యుక్త వయస్సులో ఉన్నప్పుడు వాజ్ పేయి నుంచి ఆశీస్సులు అందుకుంటున్న ఫోటోలను కూడా ఆయన ఇందులో చేర్చారు. 2018 ఆగస్టు 16 న వాజ్ పేయి దివంగతులయ్యారు.