AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ మార్క్ వ్యూహం..! వర్షాకాల సమావేశాల తర్వాతే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

కేంద్రంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి మంత్రివర్గ మార్పుల కంటే కీలక చట్టాలను ఆమోదింపజేసుకోవడానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. జూలై మూడవ వారంలో బహుశా జూలై 20 నుండి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల ముగిసిన తర్వాత, అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఈ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

మోదీ మార్క్ వ్యూహం..! వర్షాకాల సమావేశాల తర్వాతే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?
Pm Narendra Modi Strategy
Balaraju Goud
|

Updated on: Jun 30, 2026 | 4:33 PM

Share

కేంద్రంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి మంత్రివర్గ మార్పుల కంటే కీలక చట్టాలను ఆమోదింపజేసుకోవడానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. జూలై మూడవ వారంలో బహుశా జూలై 20 నుండి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల ముగిసిన తర్వాత, అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఈ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

శాసనపరమైన వ్యూహం..!

రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ‘నియోజకవర్గాల పునర్విభజన’, ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ వంటి దేశవ్యాప్తంగా అత్యంత కీలకమైన బిల్లులను ఉభయ సభల్లో ఆమోదింపజేసుకోవడంపైనే మోదీ ప్రభుత్వం గట్టిగా దృష్టి సారించింది. ఏ సభలోనూ ప్రభుత్వానికి స్పష్టమైన మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీ లేదు. ఇలాంటి తరుణంలో సమావేశాలకు ముందే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తే, పదవులు కోల్పోయే సీనియర్ నాయకులు అసంతృప్తికి గురై ఓటింగ్‌పై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే, సమావేశాల తర్వాత విస్తరణను ఉంచడం ద్వారా అవసరమైన సంఖ్యను సాధించడానికి ఇటు కూటమి భాగస్వామ్య పక్షాలతో, అటు ఇతరులతో బేరసారాలు జరపడానికి ప్రభుత్వానికి ఇది ఒక వ్యూహాత్మక అస్త్రంగా ఉపయోగపడనుంది.

ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్

మరోవైపు, జూలై 20 లోపు మంత్రివర్గంలో మార్పులు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్‌లో కూడా సమయం చాలా తక్కువగా ఉంది:

జూలై 1: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించుకుని సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు.

జూలై 1 – 3: జపాన్ ప్రధాని భారత పర్యటనకు సంబంధించిన కీలక దౌత్యపరమైన విధుల్లో ప్రధాని మోదీ నిమగ్నమై ఉంటారు.

జూలై 4: ప్రధాని మోదీ రాజస్థాన్‌లో పర్యటిస్తారు.

జూలై 6 – 11: ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో ప్రధాని పర్యటన ఉంటుంది.

దీని ప్రకారం, పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధానికి కేవలం జూలై 5 ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంది. ఒకవేళ ఆ తర్వాత విస్తరణ జరిగినా, కొత్త మంత్రులకు శాఖలపై అవగాహన పెంచుకుని పార్లమెంట్‌కు సిద్ధమవడానికి సమయం సరిపోదు. అయితే, గతంలో 2021 జూలై 7న సమావేశాలకు కొద్దిరోజుల ముందే రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ వంటి 12 మంది సీనియర్లను తొలగించి, 36 మంది కొత్తవారిని తీసుకున్న పూర్వ ఉదాహరణలు కూడా ఉన్నాయి. గత 12 ఏళ్లలో ఇప్పటివరకు నాలుగు సార్లు నవంబర్ 2014, జూలై 2016, సెప్టెంబర్ 2017, జూలై 2021 ఇలాంటి పెద్ద ఎత్తున విస్తరణలు జరిగాయి.

కేబినెట్‌లో ఖాళీలు – సమీకరణాలు

ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో కొన్ని కీలక స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా చేశారు. మరోవైపు, ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినప్పటికీ పంజాబ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రవనీత్ సింగ్ బిట్టు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అలాగే ‘ఒక వ్యక్తికి ఒక పదవి’ సూత్రం ప్రకారం.. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా మారిన సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రాల భవితవ్యంపై సందేహాలు ఉన్నాయి. అయితే, యూపీ ఎన్నికల ముందు పలుకుబడి ఉన్న కుర్మీ వర్గానికి చెందిన చౌదరిని తొలగిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావన కూడా ఉంది. గతంలో జి. కిషన్ రెడ్డి, విజయ్ సంప్లాలు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నా ఎన్నికల వ్యూహంలో భాగంగా మంత్రులుగా కొనసాగారు.

తదుపరి పునర్వ్యవస్థీకరణలో మార్పులు ఇవే!

రాబోయే కొత్త కేబినెట్ కూర్పు పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. అందులోని ప్రధాన అంశాలు:

  1. పనితీరు ఆధారంగా: మే 21న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ కార్యదర్శి ఇచ్చిన సవివరమైన ప్రజెంటేషన్ ఆధారంగా, మంత్రుల పనితీరును సమీక్షించి మార్పులు చేయనున్నారు.
  2. యువకులకు ప్రాధాన్యత: బీజేపీ జాతీయ అధ్యక్షుడి వయసు 50 ఏళ్లలోపు ఉండటంతో, కేబినెట్‌లోనూ యువతకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 70-80 ఏళ్ల వయసులో ఉన్న ఎనిమిది మంది మంత్రుల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.
  3. రాజ్యసభ సభ్యత్వం: మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, బి.ఎల్. వర్మల పదవీకాలం నవంబర్‌లో ముగుస్తుండటంతో, వారి పునఃనామినేషన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.
  4. మహిళా ప్రాతినిధ్యం: 2029 నుండి 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్న సర్కార్, కేబినెట్‌లో మహిళల సంఖ్యను పెంచనుంది. ప్రస్తుతం కీలకమైన కేబినెట్ భద్రతా కమిటీ (CCS)లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏకైక మహిళగా ఉన్నారు.
  5. ఎన్నికలు – సామాజిక సమీకరణాలు: వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచనున్నారు. అలాగే, జనాభా లెక్కల్లో కులాల విభాగం అంశం తెరపైకి రావడంతో, రాజకీయంగా కీలకమైన ఓబీసీ (OBC) వర్గాలకు పెద్దపీట వేసేఅవకాశముంది.
  6. లేటరల్ ఎంట్రీ: పరిపాలనా అనుభవం కోసం మరింత మంది మాజీ అధికారులను తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

 మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us