PM Narendra Modi meets Bill Gates: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోమ్ పర్యటన అనంతరం బ్రిటన్లోని గ్లాస్గోలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గ్లాస్గోలో మంగళవారం జరిగిన కాప్-26 (COP26) మీట్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద సాఫ్ట్వేర్ సంస్థ కో ఫౌండర్ బిల్ గేట్స్తో ప్రధాని మోదీ భేటీకావడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతదేశంలో పెటుబడులు, ఉపాధి తదితర అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు పేర్కొంటున్నారు.
Prime Minister Narendra Modi meets Microsoft co-founder Bill Gates in #Glasgow pic.twitter.com/oZ0fCAMmF4
— ANI (@ANI) November 2, 2021
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP26) 26వ సెషన్లో పాల్గొన్న ప్రధాని మోదీ పలు దేశాల మధ్య ద్వైపాక్షిక, ప్రజా సంబంధాలపై మాట్లాడారు. దీంతోపాటు గ్లాస్గోలోని భారతీయ కమ్యూనిటీ సభ్యులను కూడా కలిసి సంభాషించారు.
Also Read: