AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: నేవి సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు.. 2014 నుంచి ఎక్కడెక్కడో తెలుసా..?

దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ.. ఈసారి గోవా తీరంలో నేవీ సిబ్బందితో పండుగ జరుపుకోనున్నారు. ఇటీవల విజయవంతమైన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ఆయన ఐఎన్ఎస్ విక్రాంత్‌లో సైనికులతో పంచుకోనున్నారు. 2014 నుంచి ప్రతి సంవత్సరం సరిహద్దులు, కీలక స్థావరాల్లో మోదీ సైనికులతోనే దీపావళి జరుపుకోవడం విశేషం.

PM Modi: నేవి సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు.. 2014 నుంచి ఎక్కడెక్కడో తెలుసా..?
Pm Modi To Celebrate Diwali With Navy Personnel
Krishna S
|

Updated on: Oct 20, 2025 | 8:56 AM

Share

దేశమంతా దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధాని మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళికి స్వదేశీ నినాదాన్ని వినిపించారు. ప్రధాని మోదీ ఈసారి దీపావళిని గోవా తీరంలో నేవీ సిబ్బందితో కలిసి జరుపుకోనున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ దీటుగా జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని INS విక్రాంత్‌ యుద్ధనౌకలో మెన్ ఇన్ వైట్‌తో కలిసి ప్రధాని జరుపుకోనున్నారు. 2014లో ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి మోదీ ప్రతి దీపావళిని సాయుధ దళాల సిబ్బందితో చేసుకోవడం ఒక సంప్రదాయంగా మారింది.

ప్రతి దీపావళి స్పెషల్‌గా

ప్రధాని మోదీ 2014లో లడఖ్‌లోని సియాచిన్ హిమానీనదంలో భద్రతాదళాలతో కలిసి దీపాల పండుగను జరుపుకున్నారు. ఆ తర్వాత ఏడాది 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీరులను సత్కరించడానికి ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని డోగ్రాయ్ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించారు. 2016లో ప్రధాని హిమాచల్ ప్రదేశ్‌లోని సుమ్డో వద్ద భారత్-చైనా సరిహద్దు సమీపంలో బీఎస్ఎఫ్ సిబ్బందితో వేడుకలు జరుపుకున్నారు. మరుసటి ఏడాది ఆయన జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో బలగాలను కలిశారు.

1971 యుద్ధ స్థలంలో

2018లో మోదీ దీపావళిని ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌లోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు సిబ్బందితో కలిసి చేసుకున్నారు. ఆ తర్వాతి ఏడాది ఆయన జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరిలో సైనికులను కలిశారు. 2020 కోవిడ్-19 మహమ్మారి సమయంలో రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని లాంగేవాలాలో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇది 1971 చారిత్రక యుద్ధం జరిగిన ప్రదేశం.

కార్గిల్‌లో దీపావళి వేడుకలు

ప్రధానమంత్రి 2021 దీపావళిని జమ్మూ కాశ్మీర్‌లోని నౌషెరాలో సైనికులతో కలిసి చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి చేసుకున్నారు. గత రెండు దీపావళి పండుగలను ఆయన హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చా, గుజరాత్‌లోని సర్ క్రీక్‌లో సైనిక దళాలను కలిశారు. ఈ ఏడాది గోవా తీరంలో నేవీ సిబ్బందితో దీపావళి జరుపుకోవాలనే ప్రధాని మోదీ నిర్ణయం దేశ రక్షణలో పాలుపంచుకుంటున్న ప్రతి దళానికి తన మద్దతును తెలియజేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!
ఇంటర్నెట్ రేసులో 'సింగ్ టెల్'.. జియో, స్టార్‌లింక్‌లకు సవాల్!
ఇంటర్నెట్ రేసులో 'సింగ్ టెల్'.. జియో, స్టార్‌లింక్‌లకు సవాల్!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్
మళ్లీ జోరందుకున్న వానలు.. ఈ జిల్లాలకు హైఅలర్ట్!
మళ్లీ జోరందుకున్న వానలు.. ఈ జిల్లాలకు హైఅలర్ట్!
ఆ హీరో పక్కన అక్కగా ఛాన్స్ వచ్చింది.. చేయనని చెప్పేశా..!
ఆ హీరో పక్కన అక్కగా ఛాన్స్ వచ్చింది.. చేయనని చెప్పేశా..!
కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్‌ కట్‌చేస్తే
కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్‌ కట్‌చేస్తే
పాములా వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో!
పాములా వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో!