AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మిల్లెట్‌ బిస్కెట్ల తయారీ.. భద్రాద్రి ఆదివాసి మహిళలకు ప్రధాని మోదీ అభినందన..!

తెలంగాణలోని భద్రాచలం ఆదివాసి మహిళలు తయారు చేస్తున్న జొన్న బిస్కెట్లు లండన్ వరకు ఎగుమతి అవుతున్నాయని, మూడు నెలల్లో 40,000 శానిటరీ నాప్కిన్లు తయారు చేసిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. దేశంలోని సామాజిక రక్షణ పథకాల గురించి, అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం, ఎమర్జెన్సీ 50వ వార్షికోత్సవం గురించి కూడా ఆయన మాట్లాడారు.

PM Modi: మిల్లెట్‌ బిస్కెట్ల తయారీ.. భద్రాద్రి ఆదివాసి మహిళలకు ప్రధాని మోదీ అభినందన..!
Pm Modi
SN Pasha
|

Updated on: Jun 29, 2025 | 2:04 PM

Share

మిల్లెట్‌ బిస్కెట్లు తయారు చేస్తున్న తెలంగాణలోని భద్రాచలం ప్రాంత మహిళలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భద్రాచలంలోని ఆదివాసి మహిళలు ‘భద్రాద్రి మిల్లెట్‌ మ్యాజిక్‌’ పేరిట బిస్కెట్లు తయారు చేస్తున్నారని.. అవి హైదరాబాద్‌ నుంచి లండన్‌కు కూడా ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఈ మహిళలే మూడు నెలల్లో 40,000 శానిటరీ నాప్కిన్లను తయారు చేసి విక్రయించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు.

భారత జనాభాలో 64 శాతం కన్నా ఎక్కువ మంది దాదాపు 95 కోట్లమంది ఏదో ఒక సామాజిక రక్షణ పథకంతో లబ్ధి పొందుతున్నట్లు అంతర్జాతీయ కార్మికసంస్థ తెలిపిందని ప్రధాని మోదీ వివరించారు. 2015లో సామాజిక రక్షణ ఫలాలు కేవలం 25 కోట్ల మందికి అందేవని గుర్తుచేశారు. శాశ్వత అంధత్వానికి దారితీసే ట్రాకోమా వ్యాధి నుంచి భారత్‌ పూర్తిగా విముక్తి పొందినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ-WHO నిర్ధరించిందని 123వ మన్‌కీబాత్‌ ఎపిసోడ్‌లో మోదీ తెలిపారు.

చాలాకాలం తర్వాత అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైందన్న ప్రధాని మోదీ, యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తవడాన్ని మన్‌కీ బాత్‌లో ప్రస్తావించిన ప్రధాని, ఎమర్జెన్సీపై పోరాడిన బాబూ జగ్జీవన్‌ రామ్‌ వంటి వారిని మనం స్మరించుకోవాలనీ అది రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి