Oxygen: తమిళనాడులో విషాదం.. ఆక్సిజన్‌ అందక 11 మంది కరోనా పేషెంట్లు మృతి.. రోగుల బంధువుల ఆందోళన

Oxygen Supply: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఒక వైపు కరోనా మరణాలు సంభవిస్తుంటే.. మరో వైపు ఆక్సిజన్‌ కొరతో మరిన్ని మరణాలు సంభవిస్తున్నాయి.

Oxygen: తమిళనాడులో విషాదం.. ఆక్సిజన్‌ అందక 11 మంది కరోనా పేషెంట్లు మృతి.. రోగుల బంధువుల ఆందోళన
Oxygen
Follow us

|

Updated on: May 05, 2021 | 8:40 AM

Oxygen Supply: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఒక వైపు కరోనా మరణాలు సంభవిస్తుంటే.. మరో వైపు ఆక్సిజన్‌ కొరతో మరిన్ని మరణాలు సంభవిస్తున్నాయి. దీని కారణంగా మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా తమిళనాడులోని చెంగల్‌పట్టులో విషాదం చోటు చేసుకుంది. చెంగల్‌పట్టుని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్‌ అవసరం ఉన్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. అయితే ఆక్సిజన్‌ సరఫరాలో ఎక్కడ లోపం జరిగిందో తెలియాల్సి ఉంది.

అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కరోనా బాధితులు మృతి చెందినట్లు వారి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇలా ఆక్సిజన్‌ అందక చాలా మంది రోగులు మృత్యువాత పడుతున్నారు. ముందే దేశంలో కరోనా మహహ్మారి బారిన పడి ప్రాణాల్పోతుంటే ఇలా ఆక్సిజన్‌ అందక ఇబ్బందులకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా దేశంలో కరోనాతో, ఆక్సిజన్‌ అందక మరణమృదంగం మొగిస్తోంది. రోజురోజుకు ఆక్సిజన్‌ అందక మృతి చెందే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పటి చాలా రాష్ట్రాల్లో కరోనా రోగులకు సరైన ఆక్సిజన్‌ అందక మృతి చెందారు.

అయితే తమిళనాడే కాకుండా మంగళవారం కార్ణటకలోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 24 మంది ప్రాణాలు కోల్పోయారు. చామరాజనగర్‌ జిల్లా ఆస్పత్రిలో ఈ విషాదం చోటు చేసుకుంది. వైద్యులు మాత్రం ఆక్సిజన్ కొరతతో 12 మంది చనిపోయారని.. మిగతా రోగులు ఇతర అనారోగ్య కారణాలతో మరణించారని చెబుతున్నారు. అలాగే ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

ఇవీ చదవండి:

Duplicate Numbers: ప్లాస్మా దానం పేరుతో నకిలీ నెంబర్లు.. సోషల్‌ మీడియాలో వందలాది ఫోన్‌ నెంబర్ల లిస్టు

Corona Virus: కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అజాగ్రత్త, నిర్లక్ష్యంతో ప్రాణాలమీదకు తెచ్చుకోకండి.. కీలక సూచనలు చేసిన ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్..

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..