సుశాంత్ ది సూసైడ్ కాదు, హత్యే, బీజేపీ నేత నారాయణ్ రాణే
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది సూసైడ్ కాదని, హత్యేనని మహారాష్ట్రకు చెందిన సీనియర్ బీజేపీ నేత నారాయణ్ రాణే అన్నారు. దీన్ని ఆత్మహత్యగా చూపడానికి..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది సూసైడ్ కాదని, హత్యేనని మహారాష్ట్రకు చెందిన సీనియర్ బీజేపీ నేత నారాయణ్ రాణే అన్నారు. దీన్ని ఆత్మహత్యగా చూపడానికి ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో దాస్తోందని, ఎవరినో రక్షించడానికి యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఆయన కూడా డిమాండ్ చేశారు. (బీహార్ సీఎం నితీష్ కుమార్… సీబీఐ విచారణకు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే). ఇది చాలా ముఖ్యమైన కేసని కానీ , అందరి దృష్టినీ మళ్లించే ప్రయత్నం జరుగుతోందని రాణే అన్నారు. ‘ఇది ఆత్మహత్య కాదు..మర్డర్…ఇప్పటికి 50 రోజులు గడిచిపోయాయి.. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ముంబై పోలీసులు కూడా ఈ కేసులో హంతకుల జాడ కనిపెట్టలేకపోయారు’ అని నారాయణ్ రాణే వ్యాఖ్యానించారు.
’20 రోజులకు పైగా సుశాంత్ ని ఎవరు బెదిరిస్తూ వచ్చారు? ప్రతి రోజూ ఆయన సిమ్ కార్డులు మారుస్తూ వచ్చాడు..దీనిపై దర్యాప్తు ఎందుకు జరగడంలేదు ? ఎవరినో కాపాడడానికి యత్నిస్తున్నారని అర్థమవుతోంది’ అని రాణే పేర్కొన్నారు.
జూన్ 13 న సూరజ్ పాంచోలీ ఇంట్లో జరిగి న విందుకు హాజరైనవారిని ఎందుకు విచారించడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇక దినూ మోరియా ఎవరని, ఆయన ఇల్లు సుశాంత్ ఇంటిదగ్గరే ఉందని, పలువురు మంత్రులు దినూ ఇంటికి వెళ్లారని, ఆ రోజున పార్టీ ముగిసిన అనంతరం అందరూ అక్కడినుంచి సుశాంత్ ఇంటికి వెళ్లారని రాణే చెప్పారు .ఈ అన్ని ఘటనలపై దర్యాప్తు జరగాలన్నారు. సుశాంత్ ఆయన మాజీ మేనేజరు దిశా శాలియన్ సూసైడ్ కేసులను రెండూ కలిపి వీటిపై సమగ్ర విచారణ, దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.