AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అలలపై ఇంజనీరింగ్‌ అద్భుతం.. న్యూ పంబన్‌ బ్రిడ్జ్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు.. అన్న పాత సినిమా పాట మీకు గుర్తుందా...! ఇప్పుడీ వార్త చూస్తే... అలలపై అద్భుతాలు చేసినారు అంటూ ఆ పాత పాటకి రీమిక్స్‌ అందుకోవాల్సిందే.. నిజంగా.. అలలపై ఇంజనీరింగ్‌ అద్భుతం. అద్దిరిపోయే టెక్నాలజీతో వావ్‌ అనిపిస్తున్న దృశ్యం.

Viral: అలలపై ఇంజనీరింగ్‌ అద్భుతం.. న్యూ పంబన్‌ బ్రిడ్జ్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
New Pamban Bridge
Shaik Madar Saheb
|

Updated on: Nov 29, 2024 | 8:21 PM

Share

శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు.. అన్న పాత సినిమా పాట మీకు గుర్తుందా…! ఇప్పుడీ వార్త చూస్తే… అలలపై అద్భుతాలు చేసినారు అంటూ ఆ పాత పాటకి రీమిక్స్‌ అందుకోవాల్సిందే.. నిజంగా.. అలలపై ఇంజనీరింగ్‌ అద్భుతం. అద్దిరిపోయే టెక్నాలజీతో వావ్‌ అనిపిస్తున్న దృశ్యం. ఇదెక్కడో కాదు.. తమిళనాడు రాష్ట్రంలోని న్యూ పంబన్‌ బ్రిడ్జ్. బ్రిడ్జ్‌ అంటే మామూలు బ్రిడ్జ్‌ కాదు… దేశంలోనే ఫస్ట్‌ వర్టికల్ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్. 105 ఏళ్లనాటి వారధి స్థానంలో దీన్ని నిర్మించారు. పాత పంబన్‌ బ్రిడ్జ్‌ తుప్పుపట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోవడంతో… దాని సమీపంలోనే ఈ న్యూ పంబన్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం చేపట్టారు. లేటెస్ట్‌ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు.

వావ్‌ అనిపించే ఈ దృశ్యాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అలలపై ఇంజనీరింగ్‌ అదరహో అంటూ కొనియాడారు. పాత, కొత్త పంబన్‌ వంతెనల మధ్య తేడాలను వివరించారు. టెక్నాలజీలోనే కాదు స్పీడ్‌లోనూ అదరగొడుతుందంటూ కొనియాడారు. త్వరలోనే ఈ నయా బ్రిడ్జ్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.

వీడియో చూడండి..

రామనాథపురం జిల్లాలో మండపం, రామేశ్వరం ద్వీపం మధ్య 1914లో పంబన్ వంతెనను సముద్రంలో నిర్మించారు. అప్పట్లో దాని నిర్మాణం 20 లక్షలతో పూర్తైంది. 2.6 కి.మీ పొడవైన వంతెనను 2006లో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌కు మార్చారు. ఈ బ్రిడ్జి మధ్య నుంచి పడవలు, షిప్స్ వెళ్లాలంటే.. 16 మంది కార్మికులు పనిచేస్తేనే వంతెన తెరుచుకుంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా అధునాతన సాంకేతికతను జోడించారు. 2019 మార్చిలో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు.

అశ్విని వైష్ణవ్ ట్వీట్..

సముద్రంలో ఓడలు వంతెన దగ్గరకు వస్తే ఆటోమేటిక్‌గా బ్రిడ్జి పైకి లేస్తుంది. ఇలా సముద్రంపై నిర్మితమైన తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్