AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: ముస్లిం కళాకారులచే చెక్కిన అయోధ్య రామ మందిర పాలరాయి ద్వారాలు.. 2వేల ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా..

Ayodhya Ram Mandir: పవిత్ర నగరమైన అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రంలో రాంలీలా గొప్ప, దివ్యమైన రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని..

Ayodhya Ram Mandir: ముస్లిం కళాకారులచే చెక్కిన అయోధ్య రామ మందిర పాలరాయి ద్వారాలు.. 2వేల ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా..
Ayodhya Ram Mandir
Subhash Goud
|

Updated on: Jul 12, 2022 | 9:53 AM

Share

Ayodhya Ram Mandir: పవిత్ర నగరమైన అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రంలో రాంలీలా గొప్ప, దివ్యమైన రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్‌లోని గులాబీ రాయితో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ మొదటి అంతస్తు నిర్మాణం అంటే గర్భగుడి నిర్మాణం డిసెంబర్ 2023, జనవరి 2024 మధ్య పూర్తవుతుందని ఆలయ కమిటీ తెలిపింది. ఈలోగా రాంలీలాను కూడా గర్భగుడిలో ఉంచనున్నారు. ఆలయం మొదటి అంతస్తులో 14 తలుపులు ఉంటాయి. ఇప్పుడు ఈ తలుపులను ముస్లిం కళాకారులచే చెక్కిన తెల్లటి రంగు మక్రానా పాలరాయి ఫ్రేమ్‌లు, సైడ్‌లు అమర్చనున్నారు. ఈ డోర్ ఫ్రేమ్, సైడ్‌లను శ్రీరామ జన్మభూమి వర్క్‌షాప్‌కు తీసుకువచ్చి భద్రంగా ఉంచారు. ఇప్పుడు ఆలయ నిర్మాణంతో పాటు రాంలీలా గర్భగుడి, 13 ఇతర ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే, దీనికి కలపను ఎంచుకోవాలి. పొరుగున ఉన్న గోండా జిల్లాలోని బహ్రైచ్, షీషమ్-సఖు, మాన్కాపూర్ అడవుల నుండి టేకు కలపను తెప్పించనున్నారు. ఆలయ నిర్మాణంలో నిమగ్నమైన వర్కింగ్ ఆర్గనైజేషన్, ఇంజనీర్లు రాంలీలా ఆలయానికి తలుపు, తలుపు ఫ్రేమ్‌ను ఏ చెక్కతో తయారు చేయాలనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు.

90వ దశకం నుండి రామ మందిర ఉద్యమం జరుగుతున్న సమయంలో రామ్ నగరిలో రామజన్మభూమి నిర్మాణ న్యాస్ ఆలయ నిర్మాణం కోసం ఒక వర్క్‌షాప్‌ను రూపొందించారు. ఇక్కడ రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ రాళ్లను చెక్కి ఉంచారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాంలీలా రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి 3.5 నుంచి 4 లక్షల క్యూబిక్ అడుగుల రాళ్లను వినియోగించాల్సి ఉందని విశ్వహిందూ పరిషత్ ప్రాంతీయ మీడియా ఇన్‌ఛార్జ్ శరద్ శర్మ తెలిపారు. అంతే కాకుండా ఆలయానికి ఏర్పాటు చేయబోయే తలుపులు, అందులో మార్బుల్ స్టోన్ ఉంటాయి. ఈ మార్బుల్స్‌ను మక్రానా నుంచి తీసుకొచ్చామని శరద్ శర్మ తెలిపారు. ఇక్కడ గతంలో శ్రీరామ జన్మభూమి న్యాస్‌ ద్వారా చెక్కడం జరుగుతుండగా, ఆ సమయంలోనే మక్రానా నుంచి డోర్‌ ఫ్రేమ్‌, సైడ్‌లు తెప్పించామని అన్నారు.

ఆలయ నిర్మాణంలో నిర్మించే 14 ద్వారాలకు ఈ ప్రత్యేకంగా తయారు చేసే తలుపుల ప్రేమ్‌లను ఉపయోగించనున్నారు. వీటి రంగు పాలరాయిలా ఉంటాయని, ఇవి దాదాపు 2000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా రూపొందించనున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి