MP CM Shivraj: వస్తువులను, ఎరువులను ఉత్పత్తిచేయడం కోసం ఆవుపేడ కొనుగోలు చేయడానికి చూస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం

MP CM Shivraj Chouhan: ఆవు పాలు అమ్మపాలతో సమానం అయితే.. ఆవు పేడ, పంచకం  సహజమైన ఎరువులుగా ఉపయోగిస్తారు. రోజు రోజుకీ ఆరోగ్యం పట్ల పెరుగుతున్న శద్ధతో మళ్ళీ..

MP CM Shivraj: వస్తువులను, ఎరువులను ఉత్పత్తిచేయడం కోసం ఆవుపేడ కొనుగోలు చేయడానికి చూస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం
Mp Cow Shiva Raj
Follow us

|

Updated on: Nov 14, 2021 | 2:55 PM

MP CM Shivraj Chouhan: ఆవు పాలు అమ్మపాలతో సమానం అయితే.. ఆవు పేడ, పంచకం  సహజమైన ఎరువులుగా ఉపయోగిస్తారు. రోజు రోజుకీ ఆరోగ్యం పట్ల పెరుగుతున్న శద్ధతో మళ్ళీ పూర్వకాలం అలవాట్లవైపు భారతీయులు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సంచలన ప్రకటన చేశారు. ఆవు పేడతో ఎరువులు, ఇతర ఉత్పత్తులను తయారు చేసేందుకు ఆవు పేడను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అంతేకాదు పశుసంరక్షణ, వైద్య చికిత్సను సులభతరం చేయడానికి ‘109’ హెల్ప్‌లైన్ నంబర్‌తో [ప్రత్యేక అంబులెన్స్ సేవను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ‘ఇండియన్‌ వెటిరినరీ అసోసియేషన్‌’ జరిపే మహిళా పశువైద్యుల సదస్సు ‘శక్తి 2021’ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఆవు పేడను కొనుగోలు చేయడం..  దాని నుండి ఎరువులు, ఇతర ఉత్పత్తులను తయారు చేసే దిశలో ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఆవు పేడ, మూత్రంతో ఎరువులు, పురుగుమందులు, ఔషధాలు సహా ఇతర ఉత్పత్తులను తయారు చేయొచ్చని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తెలిపారు. ఇలా మహిళలు పని కల్పించే దిశగా అడుగులు వేస్తే.. గోవులు, వాటి పేడ, మూత్రం వల్ల కుటుంబాలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌ శ్మశానాల్లో పిడకలను వినియోగిస్తున్నారని గుర్తు చేశారు

ఒక్కోసారి ఆవులు, గేదెలు, ఎద్దులు వివిధ వ్యాధులతో బాధపడుతున్నాయని పేర్కొన్న ముఖ్యమంత్రి, ‘108’ (పౌరులకు అంబులెన్స్ సర్వీస్) మాదిరిగా జంతువుల కోసం ‘109’ అంబులెన్స్ సేవలను ప్రారంభించాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. ఒకొక్కసారి జంతువులను చికిత్స ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఏర్పడితే.. అది చాలా కష్టమైన పని అని.. అటువంటి సమయంలో జంతువులకు చికిత్స చేయడానికి వెటర్నరీ డాక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుంటారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గోశాలల్ని, సంరక్షణా కేంద్రాలను నెలకొల్పిందని పేర్కొన్నారు.  అయితే ప్రభుతం ఏ కార్యక్రమం చేపట్టినా.. దానికి ప్రజల భాగస్వామ్యం  ఉండాలని.. లేదంటే అవి మనుగడ సాగించలేవన్నారు.

Also Read:

నేపాల్‌లోని రౌతహత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు దుర్మరణం

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.