Modi Cabinet Decisions: రైతులకు మోదీ సర్కార్ గుడ్న్యూస్.. ఆ రైతులకు వడ్డీ మాఫీ..
Modi Cabinet Decisions: మోదీ ప్రభుత్వం రైతులకు రుణ రాయితీ పథకాన్ని కొనసాగిస్తోంది. అంటే, స్వల్పకాలిక రుణం తీసుకున్న రైతులకు సకాలంలో తిరిగి చెల్లించినందుకు వడ్డీలో 1.5% రాయితీ ఇస్తోంది.
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వల్పకాలిక రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు వడ్డీ రాయితీ పథకాన్ని మోదీ మంత్రివర్గం ప్రకటించింది. స్వల్ప కాలానికి రూ. 3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు వడ్డీలో 1.5 శాతం రాయితీ లభిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.34,846 కోట్లు కేటాయించింది. వడ్డీ రాయితీని భర్తీ చేయడానికి.. అంటే రైతులు రుణం వడ్డీని చెల్లించినందుకు ఒకటిన్నర శాతం రాయితీని భర్తీ చేయడానికి.. ప్రభుత్వం ఈ చెల్లింపును నేరుగా రుణాలు ఇచ్చే బ్యాంకులు, సహకార సంస్థలకు చెల్లిస్తుంది.
సబ్వెన్షన్ స్కీమ్ అంటే ఏంటి..
సహకార సంఘాలు, బ్యాంకుల ద్వారా రైతులకు ప్రభుత్వం నుంచి తక్కువ వడ్డీ రేట్లకు స్వల్ప , దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నారు. చాలా మంది రైతులు ఈ రుణాన్ని సకాలంలో చెల్లిస్తారు. చాలా మంది రైతులు కొన్ని కారణాల వల్ల రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోతున్నారు. అయితే, రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. అలాంటి రైతులకు మాత్రమే వడ్డీ రాయితీ పథకం (వడ్డీ రాయితీ పథకం) ప్రయోజనం లభిస్తుంది. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుంది.
క్రెడిట్ కార్డు లేని రైతులు వారి మార్కెట్ యాడర్డుకు వెళ్లి వారి కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) తయారు చేసుకోవచ్చు. ఒక రైతు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణం తీసుకుంటే.. ఆ రైతుకు 4% వడ్డీకి మూడు లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనం కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా లభిస్తుంది.
ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..
మరిన్ని జాతీయ వార్తల కోసం