Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, లారీ ఢీ.. ఏడుగురు దుర్మరణం.. ఎక్కడంటే..?

ప్రయణికులతో వెళ్తున్న బస్సు.. లారీ ఢీకొన్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లి శివారున జరిగింది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, లారీ ఢీ.. ఏడుగురు దుర్మరణం.. ఎక్కడంటే..?
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 24, 2022 | 9:23 AM

Road Accident In Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు – లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 26 మంది గాయపడ్డారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. మంగళవారం ఉదయం ప్రయణికులతో వెళ్తున్న బస్సు.. లారీ ఢీకొన్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లి శివారున జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

కాగా.. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారని.. మరో 26 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలాఉంటే.. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. బులంద్‌షహర్‌లోని గులాయోతి పిఎస్ ప్రాంతంలో ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొనడంతో ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..