మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి.. మహాన్ ఆర్యమన్ సింధియా స్పెషల్ విషెస్..
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న వేళ.. యువనేత మహానార్యమన్ సింధియా మోదీ జీవితం దేశానికే స్ఫూర్తి అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ట్వీట్ చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే తో పాటు ఆయన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానం పూర్తయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రముఖులు, యువ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తనయుడు మహాన్ ఆర్యమన్ సింధియా ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానితో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ ఆయన ప్రత్యేక సందేశాన్ని రాసుకొచ్చారు.
మహాన్ ఏమన్నారంటే..?
“దేశానికి విశిష్ట సేవలందిస్తున్న గౌరవనీయ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేశ సేవ అనే మార్గంలో ఏమాత్రం అలసట లేకుండా, నిరంతరం ముందుకు సాగడానికి మీ జీవితం ప్రతి భారతీయుడికీ గొప్ప స్ఫూర్తి. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయువును ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.” అని ఎక్స్లో పోస్ట్ చేశారు.

Mahanaaryaman Scindia
