AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue: అక్కడ అల్లాడిస్తోన్న డెంగ్యూ.. వేలల్లో నమోదవుతోన్న కేసులు.. ఆస్పత్రులన్నీ ఫుల్

ఆస్పత్రులన్నీ డెంగ్యూ బాధితులతో నిండిపోతున్నాయి. మొన్నటిదాకా కరోనాతో కంటిమీద కునుకు లేకుండా గడిపిన జనం నేడు డెంగ్యూతో కకావికలమవుతున్నారు.

Dengue: అక్కడ అల్లాడిస్తోన్న డెంగ్యూ.. వేలల్లో నమోదవుతోన్న కేసులు.. ఆస్పత్రులన్నీ ఫుల్
Dengue
Ram Naramaneni
|

Updated on: Sep 13, 2021 | 6:55 AM

Share

ఇంకా కరోనా పీడ తొలగనేలేదు. అప్పుడే డెంగ్యూ దడ మొదలైంది. మధ్యప్రదేశ్‌లో వేల సంఖ్యలో నమోదవుతున్న డెంగ్యూ కేసులు జనాన్ని భయపెడుతున్నాయి. అవును అక్కడ ఇప్పుడు డెంగ్యూ వణికిస్తోంది. జ్వరాలతో జనం అల్లాడుతున్నారు. మధ్యప్రదేశ్‌ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆస్పత్రులన్నీ డెంగ్యూ బాధితులతో నిండిపోతున్నాయి. మొన్నటిదాకా కరోనాతో కంటిమీద కునుకు లేకుండా గడిపిన జనం నేడు డెంగ్యూతో కకావికలమవుతున్నారు. ఇప్పటివరకూ 2 వేల 400 మంది డెంగ్యూ బారిన పడ్డారు. ఆస్పత్రుల్లో అడ్మిట్‌ అవుతున్న రోగుల్లో 20 శాతం మంది డెంగ్యూ బాధితులే. డెంగ్యూ రోగుల్లో ఎక్కువ మంది దోమకాటుకు గురైన వాళ్లే ఉంటున్నారు. మండ్‌సార్‌ జిల్లాలో దోమకాటుతో 800 మంది డెంగ్యూ బారిన పడ్డారు. ఇటు జబాల్‌పూర్‌ జిల్లాలోనూ డెంగ్యూ కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. ఇండోర్‌, అగర్‌మాల్వా, రాట్లం జిల్లాల్లోనూ డెంగ్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది. డెంగ్యూ బారిన పడి ఇప్పటివరకూ పదుల సంఖ్యలో జనాలు చనిపోయారు.

మరోవైపు.. డెంగ్యూ కేసుల పెరుగుదలతో అప్రమత్తమైంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. డెంగ్యూ కారకాలైన దోమల నివారణ చర్యల్ని చేపడుతోంది. ఫాగింగ్‌ యంత్రాలతో దోమల ఆవాసాలపై స్ప్రే చేయిస్తోంది. అసలే వర్షాకాలం.. పారిశుద్ధ్య లోపం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నీటి గుంతలు దోమల ఆవాసాలుగా మారుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తోంది. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ భారీగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. హాస్పిటల్స్ అన్నీ రోగులతో కిక్కిరుస్తున్నాయి.

Also Read: రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్

దమ్ దమ్ చేస్తానంది.. వారం కూడా ఉండలేకపోయింది.. బిగ్‌బాస్‌ తొలి ఎలిమినేషన్‌ ఆమే..!

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు