
దేశవ్యాప్తంగా పోల్ కోలాహాలం ముగిసింది. ఏడు దశల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఎగ్జాట్లీ ఆరున్నరకు టీవీ9 ఎగ్టిట్ పోల్స్ ఫలితాలను తెరపైకి తెచ్చింది. టీవీ9 – పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ నిర్వహించిన సర్వేలో ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ 13 స్థానాలు, టీడీపీ 9 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తేలింది.
దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతుందని దాదాపు అన్ని సర్వేలు వెల్లడించాయి. టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్సైట్ ఎగ్జిట్ పోల్స్ 2024 ఫలితాల ప్రకారం.. ఎన్డీఏ కూటమికే మళ్లీ అధికారం దక్కనుండగా.. కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభంజనం ఉంటుందని వెల్లడించింది.
మొత్తం 543 స్థానాల్లో అంచనాలు ఇలా ఉంటాయని టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్సైట్ వెల్లడించింది. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఖాతా కూడా తెరవదని సర్వే వెల్లడించింది.. అంతేకాకుండా.. కొన్ని రాష్ట్రాల్లో 1 సీటుకే పరిమితమవుతుందని తెలిపింది.
2024 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..