AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది పోస్టాఫీస్‌ కాదు.. చీఫ్‌ జస్టిస్‌ ఆఫీస్‌! వర్మ కేసులో సుప్రీం కోర్టు చురకలు

న్యాయమూర్తి యశ్వంత్ వర్మ తొలగింపును సవాల్ చేసిన కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం పోస్టాఫీసు కాదని, దేశం పట్ల బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది. న్యాయమూర్తి వర్మపై దుష్ప్రవర్తన ఆరోపణలను విచారించిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికను సుప్రీం కోర్టు సమర్థించింది.

ఇది పోస్టాఫీస్‌ కాదు.. చీఫ్‌ జస్టిస్‌ ఆఫీస్‌! వర్మ కేసులో సుప్రీం కోర్టు చురకలు
Justice Yashwant Varma
SN Pasha
|

Updated on: Jul 30, 2025 | 4:32 PM

Share

భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం పోస్టాఫీసు కాదంటూ సుప్రీం కోర్టు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు చురకలు అంటించింది. చీఫ్‌ జస్టిస్‌ ఆఫీస్‌లో ఉండే వ్యక్తికి దేశం పట్ల బాధ్యత ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఢిల్లీలోని తన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా నగదు లభించిన విషయంలో వార్తల్లో నిలిచిన జస్టిస్ యశ్వంత్ వర్మను కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగింది అత్యున్నత న్యాయ స్థానం. తనపై వచ్చిన ఆరోపణలను విచారించిన ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ప్యానెల్ ఫలితాలను జస్టిస్ వర్మ సవాలు చేస్తూ.. తనను న్యాయమూర్తిగా తొలగించాలనే సిఫార్సు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పదవీకాలంలో జరిగిందని పేర్కొన్నారు.

జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ముందు న్యాయమూర్తి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, సుప్రీంకోర్టు అంతర్గత కమిటీకి న్యాయమూర్తి తొలగింపును సిఫార్సు చేసే అధికారం లేదని, దాని పరిధి ప్రధాన న్యాయమూర్తికి సలహా ఇవ్వడం వరకే పరిమితం అని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 న్యాయమూర్తుల (విచారణ) చట్టాన్ని సిబల్ ఉదహరించారు. అయితే “చీఫ్ జస్టిస్ కార్యాలయం కేవలం పోస్టాఫీసు కాదు. న్యాయవ్యవస్థ నాయకుడిగా ఆయనకు దేశానికి కొన్ని విధులు ఉన్నాయి. దుష్ప్రవర్తనకు సంబంధించిన అంశాలు ఆయనకు వస్తే, వాటిని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపాల్సిన బాధ్యత CJIకి ఉంది.” జస్టిస్ దత్తా అన్నారు.

జస్టిస్ వర్మపై దుష్ప్రవర్తన రుజువైందని ప్రధాన న్యాయమూర్తి చెప్పలేకపోయారని మిస్టర్ సిబల్ వాదించారు. “బెంచ్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది” అని సిబల్ చెప్పినప్పుడు, జస్టిస్ దత్తా స్పందిస్తూ.. “మేం నిర్ణయం తీసుకుని ఉంటే, మౌనంగా ఉండి, మిమ్మల్ని వాదించడానికి అనుమతించేవాళ్ళం. అప్పుడు తీర్పు ప్రకటించాం. కానీ అది న్యాయమైన న్యాయం కాదు. అందుకే మేం మాట్లాడుతున్నాం.. ఆర్టికల్ 141 అనేది చట్టంగా నిర్దేశించబడింది, దానిని పాటించాలి.” రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీం కోర్టు ప్రకటించిన చట్టం భారతదేశంలోని అన్ని కోర్టులపై కట్టుబడి ఉంటుంది. ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ నివేదికను వ్యతిరేకిస్తూ.. సిబల్ మాట్లాడుతూ, జస్టిస్ వర్మ కేసు ఇకపై కేవలం పార్లమెంటరీ ప్రక్రియ కాదని, “రాజకీయంగా” మారిందని అన్నారు. అయితే ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ నివేదిక ప్రాథమికమైనదని, భవిష్యత్తు కార్యకలాపాలను ప్రభావితం చేయదని కోర్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి