AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: కరోనా ఆసుపత్రి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్..!

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. పౌలామీ సాహా(25) అనే ట్రైనీ వైద్యురాలు శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆసుపత్రి భవనం నుంచి దూకింది. ఈ రోజు ఆసుపత్రికి వెళ్లిన పౌలామీ సాహా తన షిఫ్ట్ ప్రారంభం కాకముందే ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే స్పందించిన అక్కడి వారు ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించినా.. ఆ లోపే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై కోల్‌కతాకు చెందిన ఓ పోలీస్‌ అధికారి […]

Breaking: కరోనా ఆసుపత్రి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 01, 2020 | 6:41 PM

Share

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. పౌలామీ సాహా(25) అనే ట్రైనీ వైద్యురాలు శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆసుపత్రి భవనం నుంచి దూకింది. ఈ రోజు ఆసుపత్రికి వెళ్లిన పౌలామీ సాహా తన షిఫ్ట్ ప్రారంభం కాకముందే ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే స్పందించిన అక్కడి వారు ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించినా.. ఆ లోపే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

దీనిపై కోల్‌కతాకు చెందిన ఓ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. ఆసుపత్రి నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపాము. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. గత కొన్ని రోజులుగా ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తేలింది. దీనిపై దర్యాప్తును ప్రారంభించాం అని తెలిపారు. ఆమె మరణవార్తను కుటుంబసభ్యులకు తెలియజేశామని వివరణ ఇచ్చారు. కాగా ఆమె మరణించిన ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు.

Read This Story Also: నిరూపిస్తే రేపే రాజీనామా చేస్తా: కన్నాకు బుగ్గన ఛాలెంజ్‌