భద్రతా బలగాల మరో విజయం.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అరెస్ట్

| Edited By:

Aug 12, 2020 | 5:43 PM

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు మరో విజయాన్ని సాధించాయి. కుప్వారా డివిజన్‌ బందిపొరా ప్రాంతంలోని హాజిన్‌ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో..

భద్రతా బలగాల మరో విజయం.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అరెస్ట్
Follow us on

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు మరో విజయాన్ని సాధించాయి. కుప్వారా డివిజన్‌ బందిపొరా ప్రాంతంలోని హాజిన్‌ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో యాక్టివ్‌గా ఉండే అకీబ్ అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హాజిన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారం రావడంతో.. జమ్ముకశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాది అహ్మద్‌ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

కాగా,  పుల్వామా జిల్లాలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కంరాజీపొరా ప్రాంతంలో జమ్ముకశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్  చేపడుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగారు. ఈ క్రమంలో ఓ జవాన్‌ వీరమరణం పొందారు. మరో జవాన్ గాయాలపాలయ్యారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. మిగతా ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే