AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత దేశంలోనే తొలిసారి… నోయిడాలో ప్లాస్టిక్ వ్యర్ధాలతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం…

ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణం ఏ విధంగా దెబ్బ తింటుందో అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి జీవ మనుగడకే ప్రమాదకరంగా పరిణమిస్తోంది.

భారత దేశంలోనే తొలిసారి... నోయిడాలో ప్లాస్టిక్ వ్యర్ధాలతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం...
Shiva Prajapati
|

Updated on: Nov 27, 2020 | 4:48 PM

Share

ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణం ఏ విధంగా దెబ్బ తింటుందో అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి జీవ మనుగడకే ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సైతం మంచికి ఉపయోగించాలని నోయిడా అధికారులు తలంచారు. అనుకున్నదే తడవుగా ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. అది కూడా మనదేశంలో తొలిసారి ఈ ప్రయోగానికి తెరలేపడం విశేషం.

దేశంలోనే తొలిసారి నోయిడాలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నోయిడా నగర పాలక సంస్థ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. తొలుత నోయిడా 129 సెక్టార్ పరిధిలో 500 మీటర్ల మేర ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. దీనికి సంబంధించి నేడు శంకుస్థాపన కూడా చేశారు. 500 మీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టడానికి దాదాపు 35 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అవసరం అవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ రోడ్డు నిర్మాణం శంకుస్థాపనకు సంబంధించిన ఫోటోలను నోయిడా అథారిటీ సీఈవో రితూ మహేశ్వరి ట్వీట్ చేశారు.