India Vs China: చైనాకి చెక్ పెడుతూపెరుగుతున్న భారత్ వెల్లుల్లి ఎగుమతి.. మన దేశానికి డంప్ చేస్తున్న డ్రాగన్ కంట్రీ

|

Nov 02, 2023 | 11:40 AM

భారతదేశంలో దాదాపు 32.7 లక్షల టన్నుల వెల్లుల్లి ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో అత్యధికంగా వెల్లుల్లిని మధ్యప్రదేశ్ ఉత్పత్తి చేస్తుంది. అయితే చైనాలో ఉత్పత్తి పడిపోయినప్పటికీ.. ప్రపంచంలోనే చైనా వెల్లుల్లిని ఎగుమతి చేయడంలో నంబర్-1. చైనాలో ప్రతి సంవత్సరం 2 నుండి 25 మిలియన్ టన్నుల వెల్లుల్లిని ఉత్పత్తి చేస్తారు. భారతదేశపు వెల్లుల్లి పరిమాణం చైనా కంటే కొంచెం చిన్నది. అదే సమయంలో.. దీని రేటు చైనా కంటే చాలా తక్కువ.

India Vs China: చైనాకి చెక్ పెడుతూపెరుగుతున్న భారత్ వెల్లుల్లి ఎగుమతి.. మన దేశానికి డంప్ చేస్తున్న డ్రాగన్ కంట్రీ
India Vs China
Follow us on

వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ఒకటి వెల్లుల్లి.. తినే ఆహారంలో రోజూ ఉపయోగించే ఈ ‘వెల్లుల్లి’ రెండు దేశాల మధ్య కొత్త ‘యుద్ధానికి’ కూడా కారణం అయ్యేటట్లుంది. అయితే వెల్లుల్లి కోసం ఆయుధాలతో యుద్ధం చెయ్యరు.. వ్యాపార అభివృద్ధి కోసం జరనున్నది అని తెలుస్తోంది. ఒకానొక సమయంలో ప్రపంచ దేశాలకు వెల్లుల్లిని ఎక్కువగా చైనా ఎగుమతి చేసేది. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ కోసం భారత్ పోటీపడుతోంది. మన దేశంలో పండిస్తున్న వెల్లుల్లి ఎగుమతులు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు చైనాకు సమస్యగా మారింది.

ప్రస్తుతం వెల్లుల్లి ఎగుమతిలో చైనా ఇప్పటికీ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ప్రపంచంలోని 80% వెల్లుల్లిని చైనా ఎగుమతి చేసేది.. అయితే ఇటీవలి సంవత్సరాల్లో 70-75%కి ఆ ఎగుమతి పడిపోయింది. అదే సమయంలో భారత్‌ నుంచి వెల్లుల్లి ఎగుమతులు పెరిగాయి.

భారతదేశం వెల్లుల్లి ఎగుమతి

ప్రపంచంలోని సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో భారతదేశం అగ్రగామిగా ఉంది. పురాతన సుగంధ ద్రవ్యాల వ్యాపార విధానం భారతదేశం నుంచే దాదాపు అన్ని ఆదేశాలు నేర్చుకున్నారు. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే భారతదేశ మసాలా దినుసుల ఎగుమతుల్లో వెల్లుల్లి వాటా వేగంగా పెరిగింది. స్పైస్ బోర్డ్ డేటా ప్రకారం, 2022-23 ఏప్రిల్ నుండి జనవరి వరకు కేవలం 10 నెలల్లో వెల్లుల్లి ఎగుమతిలో 165% వృద్ధి నమోదైంది.

ఇవి కూడా చదవండి

ఈ కాలంలో భారతదేశం 47,329 టన్నుల వెల్లుల్లిని ఎగుమతి చేసింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతి  57,346 టన్నులు.. అంటే 2021-22 కంటే 159% ఎక్కువ. 2023-24 గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. మన దేశం నుంచి వెల్లుల్లి ఎగుమతులు భారీగా పెరుగుతుంటే.. అందుకు విరుద్ధంగా చైనాలో వెల్లుల్లి ఉత్పత్తిలో 25% వరకు క్షీణత నమోదైంది. భారతీయ వెల్లుల్లి పాశ్చాత్య ఆసియా, ఆఫ్రికా దేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది.

మనదేశంలో 32 లక్షల టన్నుల వెల్లుల్లి పండుతుంది

భారతదేశంలో దాదాపు 32.7 లక్షల టన్నుల వెల్లుల్లి ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో అత్యధికంగా వెల్లుల్లిని మధ్యప్రదేశ్ ఉత్పత్తి చేస్తుంది. అయితే చైనాలో ఉత్పత్తి పడిపోయినప్పటికీ.. ప్రపంచంలోనే చైనా వెల్లుల్లిని ఎగుమతి చేయడంలో నంబర్-1. చైనాలో ప్రతి సంవత్సరం 2 నుండి 25 మిలియన్ టన్నుల వెల్లుల్లిని ఉత్పత్తి చేస్తారు.

భారతదేశపు వెల్లుల్లి పరిమాణం చైనా కంటే కొంచెం చిన్నది. అదే సమయంలో.. దీని రేటు చైనా కంటే చాలా తక్కువ. ప్రపంచ మార్కెట్‌లో చైనీస్ వెల్లుల్లి ధర టన్నుకు 1250 డాలర్లు ఉండగా, భారతీయ వెల్లుల్లి టన్నుకు 450 నుంచి 1000 డాలర్లకు లభిస్తోంది. అందువల్ల పేదల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన వెల్లుల్లిని ధనిక దేశాలకు భారతదేశం అందించగలదు. చైనా వెల్లుల్లికి అమెరికా, యూరప్ దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండగా, భారత్ వెల్లుల్లిని మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, వియత్నాంలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది.

డంపింగ్‌ చేస్తున్న చైనా వెల్లుల్లి

దేశీయ రైతుల ఆర్ధికాభివృద్ధి కోసం చాలా కాలం నుంచి భారతదేశం..  చైనా నుంచి వెల్లుల్లిని దిగుమతి చేసుకోవడం లేదు. అదే సమయంలో.. చైనా అడ్డదారిలో తరచుగా నేపాల్, బంగ్లాదేశ్ ద్వారా మన దేశానికి డంప్ చేస్తుంది. ఈ రెండు దేశాలతో భారతదేశం వెల్లుల్లిలో సుంకం రహిత వ్యాపారం చేస్తుంది. చైనీస్ వెల్లుల్లి భారతదేశానికి చేరుకోవడంతో రైతులకు నష్టం మాత్రమే కాదు.. ఈ వెలుల్లితో అనేక బ్యాక్టీరియాలు, వ్యాధులను తీసుకుని వస్తున్నాయి. ఈ వెల్లుల్లి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇటీవల, చైనాలో ‘మురుగు నీటిలో’ వెల్లుల్లి పండిస్తున్నారని వైరల్ వీడియో పేర్కొంది. అంతేకాదు తమ దేశంలో పండించే వెల్లుల్లి  తెల్లగా కనిపించేలా చేయడానికి కృత్రిమంగా ‘బ్లీచ్’ చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..