Delhi: అమ్మాయి విషయంలో గొడవ.. మైనర్‌ బాలికను గన్‌తో కాల్చిన మరో మైనర్..

|

Mar 07, 2023 | 10:02 AM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. గన్‌ఫైర్‌ కలకలం రేపింది. మైనర్‌ బాలికను గన్‌తో కాల్చేశాడు మరో బాలుడు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రీతిని గమనించిన..

Delhi: అమ్మాయి విషయంలో గొడవ.. మైనర్‌ బాలికను గన్‌తో కాల్చిన మరో మైనర్..
Gun Fire
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. గన్‌ఫైర్‌ కలకలం రేపింది. మైనర్‌ బాలికను గన్‌తో కాల్చేశాడు మరో బాలుడు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రీతిని గమనించిన ఆమె కుటంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక కాల్పుల అనంతరం పారిపోయాడు నిందితుడు ఖాసిమ్‌. తూర్పు ఢిల్లీలోని నంద్ నగ్రిలో జరిగిందీ ఘటన.. ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన మైనర్‌ కోసం గాలింపు చేపట్టారు. అయితే, పోలీసుల విచారణలో వారిద్దరు స్నేహితులని తేలింది. ఓ అమ్మాయి విషయంలో ఖాసిమ్, ప్రీతి మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే ఖాసిమ్‌ తనను కాల్చాడని ప్రీతి చెప్పింది. అలాగే ఇదేమి మొదటిసారి కాదని, ఇంతకముందు కూడా ఓసారి ఇంటికి వచ్చి తనని ఇలాగే బెదిరించినట్లు తెలిపింది ప్రీతి.

అయితే ఆమె కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రసుత్తం నిందితుడి ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అటు పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రసుత్తం ప్రీతికి ఎలాంటి ప్రమాదం లేదని, ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. మరోవైపు పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..