Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్‌లో ముక్కలైన భారత యుద్ధ విమానం వెనుక విషాదం..10 రోజుల కిందటే నిశ్చితార్థం.. అంతలోనే.!

భారత వాయుసేనకు చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానం గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో కుప్పకూలింది. పొలాల్లో క్రాష్ కావడంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా..

గుజరాత్‌లో ముక్కలైన భారత యుద్ధ విమానం వెనుక విషాదం..10 రోజుల కిందటే నిశ్చితార్థం.. అంతలోనే.!
Jaguar Fighter Jet Crashes
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 04, 2025 | 12:20 PM

భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ గుజరాత్‌లోని జామ్ నగర్ ప్రాంతంలో కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ఓ పైలట్‌ సురక్షితంగా బయటపడగా, మరో పైలట్‌ మృతిచెందారు. మృతుడు వైమానిక దళ పైలట్ సిద్ధార్థ్ యాదవ్‌గా గుర్తించారు. ఇక్కడ మరింత విషాధకరమైన విషయం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో మృతిచెందిన పైలట్‌ సిద్ధార్థ్‌కు మార్చి 23న ఢిల్లీకి చెందిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగినట్లు తాజాగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిశ్చితార్థం జరిగిన 10 రోజులకే ఈ దుర్ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

భారత వాయుసేనకు చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానం గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో కుప్పకూలింది. పొలాల్లో క్రాష్ కావడంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. మరో పైలెట్ సిద్ధార్థ్‌ మృతిచెందాడు. ఈ మేరకు భారత వాయుసేన అధికారుల స్పందిస్తూ.. పైలట్‌ మృతిని ధృవీకరించారు. మృతిచెందిన పైలట్‌ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి