మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. సోమవారం నుంచి వైన్స్‌ ఓపెన్‌..!

| Edited By: Pardhasaradhi Peri

May 02, 2020 | 7:28 PM

ఎట్టకేలకు మందుబాబులకు శుభవార్త అందింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ మూడవ దశ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మందుబాబుల కోసం సడలింపు అందించిన  విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం విక్రయాలు చేసుకోవచ్చంటూ పేర్కొన్న సంగతి తెలిసందే. అయితే దీనికి పలు కండిషన్లు కూడా పెట్టింది. ఏ జోన్‌లో అమ్మాలన్న దానిపై  నిర్దేశించదింది. ఈ క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్ మూడవ దశ ప్రారంభం కాబోతున్న […]

మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. సోమవారం నుంచి వైన్స్‌ ఓపెన్‌..!
Follow us on

ఎట్టకేలకు మందుబాబులకు శుభవార్త అందింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ మూడవ దశ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మందుబాబుల కోసం సడలింపు అందించిన  విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం విక్రయాలు చేసుకోవచ్చంటూ పేర్కొన్న సంగతి తెలిసందే. అయితే దీనికి పలు కండిషన్లు కూడా పెట్టింది. ఏ జోన్‌లో అమ్మాలన్న దానిపై  నిర్దేశించదింది. ఈ క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్ మూడవ దశ ప్రారంభం కాబోతున్న రోజే మద్యం విక్రయాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. మే 4వ తేదీన సోమవారం నాటి నుంచి లిక్కర్ విక్రయాలకు అనుమతివ్వనుంది. శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిమాచల్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ్ విలేకరులతో అన్నారు. అంతేకాదు. కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న క్రమంలో.. మార్చి 22 నుంచి మే 3వ తేదీ వరకు మద్యం విక్రయ దారుల నుంచి ఎలాంటి లైసెన్స్‌ ఫీజులను వసూలు చేయకూడదిని కూడా నిర్ణయించినట్లు తెలిపారు.