మాకు కాలుష్యం..మీకు ప్యూరిఫయర్లు..అదిరిందయ్యా మోదీ జీ !

ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో పొగడ్తలెన్నుంటాయో… విమర్శలు అదే స్థాయిలో వుంటాయి. ఒక్కోసారి విమర్శల శాతమే ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ వరస్ట్ స్టేజికి చేరుకున్న నేపథ్యంలో మోదీపై సెటెర్ల జోరెక్కువైంది సోషల్ మీడియాలో. అది కూడా ట్విట్టర్ వేదికగా మోదీని తెగ విమర్శించేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఎందుకంటారా ? రీడ్ దిస్ స్టోరీ.. ఢిల్లీ కాలుష్యం పెను ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కోరోజు ప్రమాదస్థాయిని మించి పోతున్న కాలుష్యం […]

మాకు కాలుష్యం..మీకు ప్యూరిఫయర్లు..అదిరిందయ్యా మోదీ జీ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 13, 2019 | 7:10 PM

ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో పొగడ్తలెన్నుంటాయో… విమర్శలు అదే స్థాయిలో వుంటాయి. ఒక్కోసారి విమర్శల శాతమే ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ వరస్ట్ స్టేజికి చేరుకున్న నేపథ్యంలో మోదీపై సెటెర్ల జోరెక్కువైంది సోషల్ మీడియాలో. అది కూడా ట్విట్టర్ వేదికగా మోదీని తెగ విమర్శించేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఎందుకంటారా ? రీడ్ దిస్ స్టోరీ..

ఢిల్లీ కాలుష్యం పెను ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కోరోజు ప్రమాదస్థాయిని మించి పోతున్న కాలుష్యం కారణంగా ఢిల్లీ జనం అల్లాడిపోతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు సరి, బేసి వంటి పెద్దగా ఉపయోగపడని నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం అమల్లోకి తెస్తూనే వుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కార్యాలయం కోసం ఎయిర్ ప్యూరిఫయర్లు కొనడం వివాదాస్పదమైంది. ఇందుకోసం ఏకంగా 36 లక్షల రూపాయలు వెచ్చించడంపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.

2018 మార్చిలో రాయిటర్స్ వెలువరించిన నివేదిక ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. అందులో ప్రధాని మోదీ కార్యాలయంతోపాటు ఆరు కేంద్ర శాఖల కార్యాలయాల కోసం 36 లక్షల రూపాయలు వెచ్చించి ఎయిర్ ప్యూరిఫయర్లు కొనుగోలు చేసినట్లు పేర్కొనడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి హర్షవర్ధన్, మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోశాయి.

ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని అధిగమించేందుకు ప్రజలంతా క్యారెట్లు ఎక్కువగా తినాలంటూ హర్షవర్ధన్ చేసిన చౌకబారు సూచనపై నెటిజన్ల సెటైర్లు ఎక్కువయ్యాయి. మరోవైపు ప్రకాశ్ జవదేకర్ మరో అడుగు ముందుకేసి పొద్దున్నే సంగీతం వింటూ నిద్ర లేస్తే.. ఎలాంటి గాలి కాలుష్యం ఏమీ చేయదని ప్రకాశ్ కామెంట్ చేశారు. ఈ ఇద్దరి కామెంట్లకు ప్యూరిఫయర్ల ఖర్చను జోడిస్తూ సోషల్ మీడియాలో పోస్టులతో అదరగొడుతున్నారు నెటిజన్లు.

అయితే.. ప్రధాని నేరుగా ఢిల్లీ కాలుష్యంపై కామెంట్లేమీ చేయకపోవడం గమనార్హం. పైగా ఢిల్లీ కాలుష్యానికి కారణమవుతున్న పంజాబ్, హర్యానా, యుపి రైతుల పంటల కాల్చివేత చర్యలను తగ్గించేందుకు మోదీ చర్యలకు ఉపక్రమించారు. పంటలను కోయగా మిగిలిన పొలాలను కాల్చి వేసేందుకు తగిన పనిముట్లను, పరికరాలను తక్షణం మూడు రాష్ట్రాల రైతులకు సరఫరా చేయాలని ప్రధాని.. వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. అయితే.. నెటిజన్లు మాత్రం మోదీనే టార్గెట్ చేస్తుండడం మరోవైపు విమర్శలకు దారి తీస్తోంది.

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..