Married Couple: కొత్త జంటలకు వెడ్డింగ్ కిట్‌లు.. ప్యాక్‌లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు.. ఎక్కడో తెలుసా?

|

Aug 14, 2022 | 6:30 AM

కుటుంబ నియంత్రణ శాశ్వత, తాత్కాలిక పద్ధతుల గురించి యువ జంటలకు అవగాహన కల్పించడం, వాటిని పాటించేలా అవగాహన కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

Married Couple: కొత్త జంటలకు వెడ్డింగ్ కిట్‌లు.. ప్యాక్‌లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు.. ఎక్కడో తెలుసా?
Newly Married Couple
Follow us on

కొత్తగా పెళ్లైన జంటలకు పెళ్లి కిట్‌లు ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద వివాహ కిట్‌లో కండోమ్‌లతో పాటు కుటుంబ నియంత్రణకు సంబంధించిన అనేక ఇతర వస్తువులను ఉంచుతున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. వివాహ కిట్‌లో కుటుంబ నియంత్రణ పద్ధతులు, దాని ప్రయోజనాలు, వివాహ నమోదు ధృవీకరణ పత్రం, కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు వంటి సమాచారంతో కూడిన పుస్తకం ఉండనుందంట.

ఇవే కాకుండా ప్రెగ్నెన్సీ కిట్, టవల్, దువ్వెన, నెయిల్ కట్టర్, మిర్రర్ కూడా ఉంటుంది. కుటుంబ నియంత్రణ శాశ్వత, తాత్కాలిక పద్ధతుల గురించి యువ జంటలకు అవగాహన కల్పించడం, వాటిని పాటించేలా వారికి అవగాహన కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.

సెప్టెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది..

ఇవి కూడా చదవండి

ఈ పథకం గురించి ఫ్యామిలీ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ బిజయ్ పాణిగ్రాహి మాట్లాడుతూ, ఇది నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ‘నాయి పహల్ యోజన’లో ఒక భాగం. కొత్తగా పెళ్లయిన జంటల్లో కుటుంబ నియంత్రణ పాటించేలా అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ఇది జిల్లా, బ్లాక్ స్థాయి నుంచి ప్రారంభమవుతుంది. ఈ పథకం ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. దీని కోసం, ఆశా వర్కర్లకు శిక్షణ ఇస్తున్నారు. తద్వారా వారు దానిని సక్రమంగా దత్తత తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తారు’ అని తెలిపారు.

తొలి రాష్ట్రంగా ఒడిశా..

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్నో వాగ్దానాలు చేస్తూనే ఉన్నాయని, అయితే తొలిసారిగా ఏ రాష్ట్రమైనా కొత్తగా పెళ్లయిన జంటలకు పెళ్లికి సంబంధించిన కిట్‌లను కండోమ్‌లు, ఇతర సామాగ్రి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ప్రజలకు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, సైకిళ్లు మొదలైనవి ఇస్తామని వాగ్దానం చేస్తుంటాయి. అయితే ఈ పథకాన్ని ప్రారంభించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలవనుంది.