AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళ నుంచి గొర్రెలు కొనేందుకు వచ్చి, ఛీ.. ఎలాంటి పని చేశాడంటే..?

కర్ణాటకలోని కొడూరు తాలూకా నిధఘట్ట గ్రామానికి చెందిన హేమావతి అనే గొర్రెల పెంపకందారురాలు తన గొర్రెలను అమ్మి 25,000 రూపాయలు నకిలీ నోట్ల రూపంలో అందుకుంది. బ్యాంకులో డిపాజిట్ చేసేటప్పుడు ఈ మోసం బయటపడింది. ఈ ఘటనతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగించే వారికి ఇది పెద్ద దెబ్బ.

మహిళ నుంచి గొర్రెలు కొనేందుకు వచ్చి, ఛీ.. ఎలాంటి పని చేశాడంటే..?
Karnataka Case
SN Pasha
|

Updated on: Apr 18, 2025 | 5:39 PM

Share

చాలా మంది గొర్రెల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతుంటారు. జీవాలను ఎంతో కష్టపడి సాది, వాటిని అమ్ముకొని.. ఆ డబ్బుతోనే జీవనం సాగిస్తుంటారు. అదేవిధంగా కదూర్ తాలూకాలోని నిధఘట్ట గ్రామానికి చెందిన ఒక మహిళ గొర్రెలను పెంచుకుంటూ దాని ద్వారా వచ్చే లాభాలతో జీవనోపాధి పొందుతోంది. అయితే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ మహిళ నుంచి గొర్రెలను కొని, నకిలీ డబ్బులు ఇచ్చి పారిపోయాడు.

ఉత్తర కన్నడ జిల్లా అడుగుజాడల్లోనే, చిక్కమగళూరు జిల్లాలోని ప్రజల చేతుల్లో కూడా నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. కదూర్ తాలూకాలోని నిడఘట్ట గ్రామానికి చెందిన హేమావతి నుండి గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెలను కొనుగోలు చేసి ఆమెకు నకిలీ నోట్లను ఇచ్చాడు. హేమావతి గొర్రెలను అమ్మడం ద్వారా సంపాదించిన డబ్బును తన బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ నోట్లు నకిలీ నోట్లని బ్యాంకు అధికారులు తెలిపారు. దాంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ అయింది.

హేమావతి గొర్రెలను రూ.25 వేల అమ్మేసింది. హేమావతి ఈ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లగా అసలు మోసం బయటపడింది. ఈ 25,000 రూపాయలలో 14,000 రూపాయల నోట్లు నకిలీవి. ఐదు వందల రుపాయల 28 నోట్లు నకిలీవని బ్యాంకు సిబ్బంది ఆ మహిళకు చెప్పారు. పాపం.. కాయకష్టం చేసుకుంటూ.. బతుకుబండి లాగేందుకు ఆమె ఎంతో కష్టపడి జీవాలను పెంచుతుంటే.. ఎవడో ఈ విధంగా మోసం చేయడంతో స్థానికులు అతనికి శాపనార్థాలు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.