AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ కస్టమర్ కేర్ నంబర్ చూసి కాల్ చేసిన మహిళకు షాక్.. దెబ్బకు ఖాతాలోంచి ఆరు లక్షలు గోవిందా..!

ఈ సంఘటన జనవరి 4వ తేదీ ఉదయం 7.30 గంటలకు జరిగింది. ఉదయం ఫిర్యాది ఇంట్లో గ్యాస్ అయిపోయింది. కొత్త సిలిండర్‌కు రెగ్యులేటర్ సరిపోలేదు.

గ్యాస్ కస్టమర్ కేర్ నంబర్ చూసి కాల్ చేసిన మహిళకు షాక్.. దెబ్బకు ఖాతాలోంచి ఆరు లక్షలు గోవిందా..!
Cash
Jyothi Gadda
|

Updated on: Jan 20, 2023 | 8:39 PM

Share

గూగుల్‌లో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌గా నమోదు చేయబడిన నంబర్‌కు కాల్ చేసిన మహిళను నిలువునా ముంచేశారు సైబర్ దొంగలు. ఒక మహిళ నుండి రూ. 5 లక్షల 73 వేల రూపాయలు కాజేశారు. గ్యాస్ అయిపోయిన తర్వాత రెగ్యులేటర్ కొత్త సిలిండర్‌కు సరిపోవటం లేదని సదరు మహిళ కస్టమర్‌ కేర్‌ని సంప్రదించింది.. అప్పుడు గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్‌కి కాల్ చేసింది. అందుకు వారు.. తమ మనిషి వచ్చి రెగ్యూలెటర్‌ ఇన్‌స్టాల్ చేస్తాడని చెప్పారు.. ఇక్కడ ఓ సీనియర్ సిటిజన్ మహిళ హెచ్‌పీ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌ను గూగుల్ చేసింది. అతను ఇచ్చిన సలహాను ప్రాసెస్ చేశాడు. అదే సమయంలో సైబర్ కేటుగాళ్లు ఆమెను మోసం చేశారు. ఈ ఘటన ముంబయి నగరం పూణేలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణేలోని భండార్కర్ రోడ్డులో నివసిస్తున్న 64 ఏళ్ల మహిళ దక్కన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన జనవరి 4వ తేదీ ఉదయం 7.30 గంటలకు జరిగింది. ఉదయం ఫిర్యాది ఇంట్లో గ్యాస్ అయిపోయింది. కొత్త సిలిండర్‌కు రెగ్యులేటర్ సరిపోలేదు. దాంతో గూగుల్‌లో హెచ్‌పీ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌ని సెర్చ్ చేసి సంప్రదించారు. రెగ్యులేటర్ గురించి చెప్పడంతో, అతను తన మొబైల్‌లో క్విక్ హెల్ప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని అడిగాడు. అందులో మొత్తం సమాచారాన్ని నింపాలని కోరారు. అలా ఆమె బ్యాంకుతో సహా మొత్తం సమాచారాన్ని పూరించారు. ఆ తర్వాత సదరు సైబర్‌ మోసగాడు.. 25 రూపాయలు పంపమని అడిగాడు. డబ్బులు పంపిన తర్వాత టెక్నీషియన్ వచ్చి మీ దగ్గర పని చేస్తాడని, డబ్బు అవసరమైతే చెబుతానని సైబర్ దొంగ చెప్పాడు.

హెచ్‌పీ నుంచి మీకు 25 రూపాయల రసీదు వస్తుందని చెప్పి ఫోన్‌లో మాట్లాడుతుండగానే 25 రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ వెంటనే ఆమె మొబైల్‌కి మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. దాంతో తాము మోసపోయామని గ్రహించారు. వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతాను స్తంభింపజేయాలని కోరారు.. అంతలోనే సైబర్ దొంగలు వారి ఖాతా నుంచి 5 లక్షల 73 వేల 807 రూపాయలు డ్రా చేసి మొత్తం ఖాతానే ఖాళీ చేశారు.

ఇవి కూడా చదవండి

గతంలో పూణెకు చెందిన 71 ఏళ్ల వృద్ధుడిని రూ.35 లక్షలు మోసం చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. MHADAలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఓ అధికారిని జీవిత బీమా పేరుతో సైబర్ దొంగలు మోసం చేశారు. ఢిల్లీ, నోయిడాలోని 12 వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో 35 లక్షలు మోసపూరితంగా జమ చేశారు. ఈ సీనియర్ సిటిజన్‌ను ఏడాదిన్నర క్రితం “లైఫ్ ఇన్సూరెన్స్” తీసుకుని మంచి రాబడి పొందుతామని ఎర వేశారు. దీనికి ప్రీ ఇన్‌స్టాల్‌మెంట్ ఫీజు మాత్రమే చెల్లించాలని తెలిపింది. ఆ తర్వాత సైబర్ దొంగలు డబ్బును వేరే బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..