గణతంత్ర వేడుకల సాక్షిగా… వరుస పేలుళ్లతో దద్దరిల్లిన అసోం..

ఓ వైపు దేశ ప్రజానీకం మొత్తం గణతంత్ర వేడుకల్లో నిమగ్నమై ఉంటే.. మరోవైపు ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో వరుస పేలుళ్లలకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా.. దేశంలో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. నిఘా వర్గాల హెచ్చరికలను నిజం చేస్తూ.. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో.. ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి. డిబ్రూగర్, చరైదేవ్, దులియాజాన్ ప్రాంతాల్లో గ్రనేడ్ ఎటాక్‌లు జరిగాయి. ఈ ఘటనకు […]

గణతంత్ర వేడుకల సాక్షిగా... వరుస పేలుళ్లతో దద్దరిల్లిన అసోం..
Follow us

| Edited By:

Updated on: Jan 26, 2020 | 12:54 PM

ఓ వైపు దేశ ప్రజానీకం మొత్తం గణతంత్ర వేడుకల్లో నిమగ్నమై ఉంటే.. మరోవైపు ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో వరుస పేలుళ్లలకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా.. దేశంలో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. నిఘా వర్గాల హెచ్చరికలను నిజం చేస్తూ.. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో.. ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి.

డిబ్రూగర్, చరైదేవ్, దులియాజాన్ ప్రాంతాల్లో గ్రనేడ్ ఎటాక్‌లు జరిగాయి. ఈ ఘటనకు పాల్పడింది యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ పనే అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇది ఓ నిషేధిత తీవ్రవాద సంస్థ. రిపబ్లిక్ వేడుకలను బహిష్కరించాలంటూ ఈ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ శనివారం పిలుపునిచ్చింది. గ్రాహం బజార్‌లో తొలి పేలుడు సంభవించగా.. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఓ వైపు గణతంత్ర వేడుకలు జరుగుతుండగా.. ఈ వరుస బాంబు పేలుళ్లు కలకలాన్ని సృష్టించాయి.