Virbhadra Singh: మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కన్నుమూత.. చికిత్స పొందుతూ..

|

Jul 08, 2021 | 7:58 AM

Ex CM Virbhadra Singh Dies: హిమాచల్‌ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్రసింగ్ (87) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల

Virbhadra Singh: మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కన్నుమూత.. చికిత్స పొందుతూ..
Virbhadra Singh
Follow us on

Ex CM Virbhadra Singh Dies: హిమాచల్‌ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్రసింగ్ (87) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల 40 నిముషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. వీరభద్రసింగ్.. దీర్ఘ కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ.. మరణించారు. వీరభద్రసింగ్ కొంతకాలం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ జనక్ రాజ్ వెల్లడించారు. వీరభద్రసింగ్ రెండుసార్లు కరోనా బారినపడి కోలుకున్నారని.. కొన్ని రోజులుగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ఆరుసార్లు ముఖ్యమంత్రిగా…

1934 జూన్ 23న సిమ్లాలో జ‌న్మించిన‌ వీరభద్ర సింగ్.. హిమాచల్‌ప్రదేశ్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన సోలన్ జిల్లాలోని ఆర్కీ ఎమ్మెల్యేగా ఉన్నారు. చివరిసారిగా 2012 నుంచి 2017 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Also Read:

Online Services: తెలంగాణ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలు బంద్‌.. మూడు రోజులపాటు నిలిపివేత..

Crime: దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై రూ.15 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు