AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్‌లో ఉగ్రవేట.. ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల అరెస్ట్..

దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిత్యం ప్రయత్నిస్తునే ఉన్నారు. అయితే వీరి కుట్రలను సరిహద్దుల్లోనే ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంటోంది. ఇక ఇప్పటికే కశ్మీర్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులను జల్లెడపడుతున్నారు పోలీసులు. తాజాగా.. మంగళవారం ఐదుగురు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. సోపోర్‌ జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. సోమవారం సాయంత్రం పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరు తుజుర్‌ […]

కశ్మీర్‌లో ఉగ్రవేట.. ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల అరెస్ట్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 14, 2020 | 4:26 PM

Share

దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిత్యం ప్రయత్నిస్తునే ఉన్నారు. అయితే వీరి కుట్రలను సరిహద్దుల్లోనే ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంటోంది. ఇక ఇప్పటికే కశ్మీర్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులను జల్లెడపడుతున్నారు పోలీసులు. తాజాగా.. మంగళవారం ఐదుగురు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. సోపోర్‌ జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. సోమవారం సాయంత్రం పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరు తుజుర్‌ గ్రామంలోని ఓ ఇంటిపై గ్రేనేడ్‌ దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరివద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రితో పాటు.. హ్యాండ్‌ గ్రేనేడ్స్‌, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.