Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం.. పేలిన బాయిలర్‌.. ఐదుగురు మృతి

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్ జిల్లాలోని మానస్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్ కంపెనీలో అకస్మాత్తుగా ఓ బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో కంపెనీలో ఉన్న ఐదుగురు..

విషాదం.. పేలిన బాయిలర్‌.. ఐదుగురు మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 01, 2020 | 8:37 PM

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్ జిల్లాలోని మానస్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్ కంపెనీలో అకస్మాత్తుగా ఓ బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో కంపెనీలో ఉన్న ఐదుగురు కార్మికులు మృతిచెందారు. పేలుడు సంభ‌వించిన వెంట‌నే పెద్ద ఎత్తున చెలరేగిన మంట‌ల్లో.. ఐదుగురు తీవ్రంగా కాలిపోవడంతో స్పాట్‌లోనే మృతిచెందినట్లు సమాచారం. ఉమ్రేడ్ మండ‌లం బేలా గ్రామంలోలో ఉన్న కంపెనీకి చెందిన ఓ బయోగ్యాస్‌ ప్లాంట్‌లో.. శనివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Read More

ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు

రాజౌరీ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు.. జవాన్‌ వీరమరణం

ఢిల్లీలో కేసుల కంటే పెరిగిన రికవరీలు