AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక ఉజ్వలంగా దేశ ఆర్ధిక వ్యవస్థ.. సవాళ్ళను ఎదుర్కొంటాం

ఈ ఏడాది ఇండియా 3 ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్ధిక వృద్దిని సాధించడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇప్పటికే మన దేశం ఆర్ధిక రంగంలో చైనా, అమెరికా తరువాత మూడో అతి పెద్ద దేశంగా ఉందన్నారు.ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొంటామన్నారు. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆమె.. రాబోయే కొద్ది సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల మేర ఆర్ధిక వృధ్దిని సాధించడం పెద్ద కష్టమేమీ […]

ఇక ఉజ్వలంగా దేశ ఆర్ధిక వ్యవస్థ.. సవాళ్ళను ఎదుర్కొంటాం
Anil kumar poka
|

Updated on: Jul 05, 2019 | 1:45 PM

Share

ఈ ఏడాది ఇండియా 3 ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్ధిక వృద్దిని సాధించడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇప్పటికే మన దేశం ఆర్ధిక రంగంలో చైనా, అమెరికా తరువాత మూడో అతి పెద్ద దేశంగా ఉందన్నారు.ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొంటామన్నారు. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆమె.. రాబోయే కొద్ది సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల మేర ఆర్ధిక వృధ్దిని సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. వన్ నేషన్..వన్ గ్రిడ్ అనే ధ్యేయంతో దేశవ్యాప్తంగా విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్టు పేర్కొన్నారు. పవర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రాలకు తక్కువ ధరలకు విద్యుత్ పంపిణీ చేయాలన్నదే లక్ష్యమని ఆమె వివరించారు. మేకిన్ ఇండియాకు మంచి స్పందన లభిస్తోందని, దేశంలో తయారయ్యే వస్తువులకు విదేశాల్లో మంచి డిమాండ్ లభిస్తోందని ఆమె తెలిపారు. భారత్ మాల ద్వారా రోడ్డు రవాణా, సాగర్ మాల ద్వారా జలరవాణా మెరుగుపడుతుందని, ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య మిస్తోందని ఆమె చెప్పారు. భారత్ మాల- రెండో దశలో రాష్ట్రాలకు సహకారం అందుతుందన్నారు. దేశంలో ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయని, దీన్ని కట్టడి చేసేందుకు కొత్తగా అద్దె దారుల చట్టాన్ని తీసుకువస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రీఫార్మ్, పెర్ఫార్మ్ అన్న నినాదాన్ని ఆమె ప్రస్తావించారు. అంటే సంస్కరణలు.. పనితీరు మెరుగుదల అన్నవి ప్రధాన లక్ష్యాలని ఆమె వివరించారు. గ్రామీణ రుణాలను పెంచుతామని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు సరికొత్త పథకాలను ప్రవేశపెడతామని ఆమె తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇళ్ళు లేని పేదలందరికీ గృహవసతి కల్పించాలన్నదే ధ్యేయమన్నారు.నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వేగవంతం చేస్తామని చెప్పిన ఆమె.. దీన్ని దశలవారీగా చేపడతామన్నారు.

Follow Us
సొంతింటికే నిప్పు పెట్టాడు..అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు
సొంతింటికే నిప్పు పెట్టాడు..అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు
కూల్‌ డ్రింక్స్‌తో చిప్స్‌ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..?
కూల్‌ డ్రింక్స్‌తో చిప్స్‌ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..?
కోహ్లీ రికార్డు ఫసక్.. టార్గెట్ ధోనీ.. రోహిత్ సరికొత్త చరిత్ర..!
కోహ్లీ రికార్డు ఫసక్.. టార్గెట్ ధోనీ.. రోహిత్ సరికొత్త చరిత్ర..!
ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం..
ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం..
టెక్నాలజీ వాడి హత్య చేశారు.. సైలెంట్‌గా సైడ్ అవ్వాలనుకున్నారు..
టెక్నాలజీ వాడి హత్య చేశారు.. సైలెంట్‌గా సైడ్ అవ్వాలనుకున్నారు..
ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!
ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్..
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్..
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?