AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: అది పూర్తిగా ఫేక్ న్యూస్.. న్యూ వేరియంట్ లక్షణాలపై వాట్సాప్‌ సమాచారం పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ

వైరస్‌ వ్యాప్తి, కట్టడిపై ప్రభుత్వం పౌరులను అప్రమత్తం చేస్తోంది. ఇంతలో ఒమిక్రాన్ కంటే వేగంగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అందులో నిజం ఎంత ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Fact Check: అది పూర్తిగా ఫేక్ న్యూస్.. న్యూ వేరియంట్ లక్షణాలపై వాట్సాప్‌ సమాచారం పై క్లారిటీ ఇచ్చిన  కేంద్ర ఆరోగ్యశాఖ
Fake Covid 19 Variant
Sanjay Kasula
|

Updated on: Dec 22, 2022 | 7:00 PM

Share

చైనాలో విజృంభిస్తున్న బీఎఫ్‌.7 ఒమిక్రాన్‌ వైరస్‌ భారత్‌లోనూ వ్యాపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వేరియంట్‌కి చెందిన 3 కేసులు నమోదయ్యాయి. అక్టోబరులో తొలి కేసును గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ గుర్తించింది. తాజాగా గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒకటి వెలుగు చూశాయి. బయటపడుతున్న కొత్త వేరియంట్లను నిపుణులు ఎప్పటిక్పుడు పర్యవేక్షిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి, కట్టడిపై ప్రభుత్వం పౌరులను అప్రమత్తం చేస్తోంది. ఇంతలో ఒమిక్రాన్ కంటే వేగంగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇదే సమయంలో దేశంలో ప్రమాదకరమైన ఎక్స్‌బీబీ వేరియంట్‌ వ్యాపిస్తోందంటూ వాట్పాప్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ఫేక్ అని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

భారత్‌లో కూడా వచ్చేసిందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో  కొన్ని తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్‌బీబీ వేరియంట్‌ వ్యాపిస్తోందనే వార్తలు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు దాని లక్షణాలు ఇలా ఉంటాయి.. అంటూ మరో వార్తల కూడా రన్ అవుతోంది. అయితే ఈ వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది. అంతే కాదు ఓ ప్రకటన జారీ చేసింది.

మరోవైపు ఒమిక్రాన్‌ కంటే ఎక్స్‌బీబీ వేరియంట్‌ ప్రమాదకరమైనది అనడానికి ఎటువంటి సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. డెల్టా వేరియంట్ కంటే తక్కువ ప్రమాద తీవ్రత ఉంటుందని తెలిపింది. ఒమిక్రాన్‌ వేరియంట్లతో పోలిస్తే దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ తీవ్రత మాత్రం తక్కువేనని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌, ఎవాల్యూయేషన్‌ నివేదిక కూడా  వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం