AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో అత్యంత పొడవైన రైల్వే నెట్‌ వర్క్ ఈ రాష్ట్రానిదే..! భారతీయ రైల్వేలో రారాజు.. ఎన్ని వేల కిలో మీటర్లంటే..

ఇక్కడ 150 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదు ప్రాచీన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి బ్రిటిష్ కాలంలో నిర్మించబడ్డాయి. వందల సంవత్సరాల తర్వాత కూడా వాటి అందం అంతే ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ స్టేషన్లలో లక్నోలోని చార్‌బాగ్, కాన్పూర్ సెంట్రల్, గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ సెంట్రల్, ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ కూడా ఉన్నాయి.

దేశంలో అత్యంత పొడవైన రైల్వే నెట్‌ వర్క్ ఈ రాష్ట్రానిదే..! భారతీయ రైల్వేలో రారాజు.. ఎన్ని వేల కిలో మీటర్లంటే..
Indian Railways
Jyothi Gadda
|

Updated on: Aug 06, 2025 | 5:49 PM

Share

భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందింది. 68,525 కి.మీ. పొడవైన రైలు నెట్‌వర్క్ దేశంలోని ప్రతి మూలలో విస్తరించి ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు దీని ద్వారా ప్రయాణిస్తారు. ఇది మాత్రమే కాదు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల రైల్వే నెట్‌వర్క్ కలిగి ఉంది. ఇది ప్రతిరోజూ దాదాపు 2.3 కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. భారతీయ రైల్వేలను సామాన్యుల జీవనాడి అని పిలుస్తారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ రైళ్లలో ప్రయాణిస్తారు. ఉపాధి, వ్యాపారం, ఉద్యోగాల కోసం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు రైల్వే మీద ఆధారపడుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో రైల్వేలు ఒక ప్రధాన రవాణా సాధనం. యూపి రైల్వే… ఇండియన్‌ రైల్వేలలో రారాజుగా పిలుస్తారు. ఈ రాష్ట్ర రైలు నెట్‌వర్క్ ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంటుందో తెలిస్తే షాక్‌ అవుతారు.

దేశంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్ కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ మొత్తం రైలు నెట్‌వర్క్ గురించి మాట్లాడుకుంటే ఇది దాదాపు 9 వేల 77 కిలోమీటర్లు. ఇది రాష్ట్రంలోని నాలుగు మూలలకు కనెక్టివిటీని అందిస్తుంది. యుపి నుండి రైలులో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం రైల్వే స్టేషన్ల సంఖ్య 550. వీటిలో లక్నో, కాన్పూర్ సెంట్రల్, ఘజియాబాద్, గోరఖ్‌పూర్ వంటి ప్రధాన స్టేషన్ల నుండి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు సాగిస్తుంటారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని 100 కి పైగా రైల్వే స్టేషన్లను మెరుగుపరచడానికి రైల్వేలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు, రాష్ట్రంలో రైలు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశం, విదేశాల నుండి పర్యాటకులు అయోధ్య, కాశీ, మధుర, లక్నో, ఆగ్రా వంటి ప్రదేశాలను సందర్శిస్తారు. అందువల్ల, ఇక్కడ రైళ్ల సంఖ్యను పెంచుతున్నారు.

ఇవి కూడా చదవండి

యుపిలో 150 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదు ప్రాచీన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి బ్రిటిష్ కాలంలో నిర్మించబడ్డాయి. వందల సంవత్సరాల తర్వాత కూడా వాటి అందం అంతే ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ స్టేషన్లలో లక్నోలోని చార్‌బాగ్, కాన్పూర్ సెంట్రల్, గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ సెంట్రల్, ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ కూడా ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us