AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్ విషయంలో దాగుడుమూతలెందుకు ? ఈయూ ఎంపీ గుస్సా

జమ్మూ కశ్మీర్ ను సందర్శించకుండా తనను మోదీ ప్రభుత్వం అడ్డుకుందని యూరోపియన్ పార్లమెంటులో లిబరల్ డెమొక్రాట్ ఎంపీ క్రిస్  డేవిస్ ఆరోపించారు. కశ్మీర్ రాష్ట్రాన్ని విజిట్ చేయాలని తనకు ఈ నెల 7 న ఆహ్వానం అందిందని, కానీ మూడు రోజుల అనంతరం దాన్ని రద్దు చేశారని ఆయన అన్నారు. కశ్మీర్ లో ప్రజాస్వామ్య సూత్రాలను అణగదొక్కుతున్నారని, మోదీ సర్కార్ చేస్తున్న ఈ విధమైన ‘ స్టంట్ ‘ లో తాను భాగం కాదల్చుకోలేదని డేవిస్ మండిపడ్డారు.’ […]

కశ్మీర్ విషయంలో దాగుడుమూతలెందుకు ? ఈయూ ఎంపీ గుస్సా
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Oct 29, 2019 | 6:40 PM

Share

జమ్మూ కశ్మీర్ ను సందర్శించకుండా తనను మోదీ ప్రభుత్వం అడ్డుకుందని యూరోపియన్ పార్లమెంటులో లిబరల్ డెమొక్రాట్ ఎంపీ క్రిస్  డేవిస్ ఆరోపించారు. కశ్మీర్ రాష్ట్రాన్ని విజిట్ చేయాలని తనకు ఈ నెల 7 న ఆహ్వానం అందిందని, కానీ మూడు రోజుల అనంతరం దాన్ని రద్దు చేశారని ఆయన అన్నారు. కశ్మీర్ లో ప్రజాస్వామ్య సూత్రాలను అణగదొక్కుతున్నారని, మోదీ సర్కార్ చేస్తున్న ఈ విధమైన ‘ స్టంట్ ‘ లో తాను భాగం కాదల్చుకోలేదని డేవిస్ మండిపడ్డారు.’ ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఈ తీరు అందరికీ తెలిసిందే.. ప్రపంచ దేశాలు ఇప్పుడైనా ఈ అంశాన్ని గమనించడం ప్రారంభించాలి ‘ అని ఆయన కోరాడు.

జమ్మూ కశ్మీర్లోని ప్రజలతో ఎవరితోనైనా స్స్వేఛ్చగా మాట్లాడవచ్ఛునని మొదట తనకు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారని, కానీ ఆ తరువాత ప్రభుత్వ వైఖరి ఎందుకు మారిందని డేవిస్ ప్రశ్నించాడు. ఇందులోదాచడానికి భారత ప్రభుత్వానికి ఏముంది ? జర్నలిస్టులు, రాజకీయ నాయకులను స్వేఛ్చగా ప్రజలతో మాట్లాడేందుకు ఎందుకు అనుమతించడం లేదు అని అన్నాడు. ఇంగ్లండ్ లో నేను కొంతమంది కశ్మీరీలను కలిశాను.. .. కశ్మీర్ లోని తమ కుటుంబ సభ్యులను, బంధువులను తాము కాంటాక్ట్ చేయలేకపోతున్నామని వాళ్ళు చెప్పారు. ఇదెక్కడి తీరు అని కూడా ఆయన అన్నాడు. ఇది భారత ప్రభుత్వానికి మంచి పధ్దతి కాదు అని దుయ్యబట్టారు. సుమారు 27 మంది యూరోపియన్ యూనియన్ ఎంపీలు మంగళవారం కశ్మీర్ ను విజిట్ చేసిన నేపథ్యంలో డేవిస్ ‘ మండిపాటు ‘ ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా.. వారిని మోదీ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించి.. ఇందుకు అనుమతించింది.

అయితే ఈ ఎంపీ గారి ( క్రిస్) బాగోతం ఆ మధ్య వెలుగు చూసింది. ఓ స్కామ్ లో ఈయన దోషిగా తేలడంతో రీ-కాల్ పిటిషన్ అనంతరం తన పదవిని కోల్పోయాడు. తన ఎన్నికకు సంబంధించి తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించాడని ఈయనపై ఆరోపణలొచ్చాయి. బ్రిటన్ లో గత జూన్ లో జరిగిన ‘ వ్యవహార మిది ‘.. అయితే తన తప్పిదానికి డేవిస్ క్షమాపణ చెప్పుకొన్నాడు. ఇతనికి కోర్టు… 1500 పౌండ్ల జరిమానా విధించడమే గాక, 50 గంటల సామాజిక సేవ చేయాలని ఆదేశించింది.

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..