AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Violence: సీఏఏ అల్లర్లు: ఢిల్లీలోని నాలుగు ప్రదేశాల్లో కర్ఫ్యూ.. సరిహద్దులు సీజ్..!

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకుతోంది. సోమవారం మొదలైన ఈ అల్లర్లు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య పదికి చేరగా.. దాదాపు 150మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను పోలీసులు సీజ్ చేశారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించి.. నగరాన్ని అష్టదిగ్భంధనం చేశారు. ఈశాన్య ఢిల్లీ పరిధిలోని కర్నాల్ నగర్, జాఫరాబాద్, మౌజ్‌పూర్, చాంద్‌బాగ్‌ […]

Delhi Violence: సీఏఏ అల్లర్లు: ఢిల్లీలోని నాలుగు ప్రదేశాల్లో కర్ఫ్యూ.. సరిహద్దులు సీజ్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 25, 2020 | 8:03 PM

Share

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకుతోంది. సోమవారం మొదలైన ఈ అల్లర్లు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య పదికి చేరగా.. దాదాపు 150మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను పోలీసులు సీజ్ చేశారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించి.. నగరాన్ని అష్టదిగ్భంధనం చేశారు. ఈశాన్య ఢిల్లీ పరిధిలోని కర్నాల్ నగర్, జాఫరాబాద్, మౌజ్‌పూర్, చాంద్‌బాగ్‌ కర్ఫ్యూ విధించారు. కర్వాల్, బాబర్‌పూర్‌లో 144 సెక్షన్ అమల్లో ఉంది.

మరోవైపు ఈ ఘర్షణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు సంయమనంతో ఉండాలని.. శాంతి పునరుద్ధరణ కోసం అందరం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అల్లర్లో గాయపడిని క్షతగాత్రులను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి పరామర్శించిన కేజ్రీ.. ఆర్మీని రంగంలోకి దింపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అయితే సైన్యాన్ని రంగంలోకి దింపే ఆలోచన లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు.

కాగా ఈ అల్లర్ల నేపథ్యంలో వస్తోన్న వార్తలను నమ్మొద్దని పలువురు రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు. పలుచోట్ల అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తున్నారని.. ఈ అల్లర్లపై వచ్చే ఎలాంటి వార్తలను నమ్మెద్దండదని వారు చెబుతున్నారు. ఇక ఎలాంటి పుకార్లను సోషల్ మీడియాలోనూ వ్యాపించకండని పలువురు నేతలు సూచిస్తున్నారు. Read This Story Also: ఢిల్లీలో అదే ఉద్రిక్తత.. హింస.. ఏడుగురి మృతి

Follow Us
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు
క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు..
క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు..