Covid 4th Wave: దేశంలో కరోనా అలర్ట్.. పెరిగిన యాక్టివ్ కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?

India Covid-19 Updates: గత 24 గంటల్లో కూడా కరోనా కేసుల సంఖ్య 20 వేలకు పైగా నమోదయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 20,044 కేసులు నమోదయ్యాయి.

Covid 4th Wave: దేశంలో కరోనా అలర్ట్.. పెరిగిన యాక్టివ్ కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?
India Corona

Updated on: Jul 16, 2022 | 10:00 AM

India Covid-19 Updates: దేశంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మూడు రోజుల నుంచి వరుసగా 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ (Coronavirus) అనంతరం భారీగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశించింది. కాగా.. గత 24 గంటల్లో కూడా కరోనా కేసుల సంఖ్య 20 వేలకు పైగా నమోదయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 20,044 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో1,40,760 (0.32 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.80 శాతం పెరగగా.. రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది.

  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,37,30,071 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,660 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 18,301 మంది కోలుకున్నారు.
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,30,63,651 కి చేరింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 199.71 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • నిన్న 22,93,627 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 3,067, కేరళలో 2,927, మహారాష్ట్రలో 2,371, తమిళనాడులో 2,312, ఒడిశాలో 1,043 కేసులు నమోదయ్యాయి.

జాతీయ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us