అయోధ్య రామ మందిర నిర్మాణం ఎప్పుడంటే..!

| Edited By: Pardhasaradhi Peri

Jan 16, 2020 | 1:16 PM

సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వచ్చినప్పట్నించి అయోధ్య రామ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతోందన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మందిర నిర్మాణం కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేసి, దానికి సుప్రీం తీర్పు ద్వారా పొందిన 2.77 ఎకరాల భూమిని అప్పగించి, మందిర నిర్మాణం జరుపుకోవచ్చన్నది అత్యున్నత న్యాయస్థానం విస్తృత ధర్మాసనమిచ్చిన తీర్పు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గానీ, యుపి రాష్ట్ర ప్రభుత్వం గానీ ట్రస్టును నియమించాలన్నమాట. ఏపీలో టీటీడీ వంటి ఓ ట్రస్టు అయోధ్య రామమందిరం […]

అయోధ్య రామ మందిర నిర్మాణం ఎప్పుడంటే..!
Follow us on

సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వచ్చినప్పట్నించి అయోధ్య రామ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతోందన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మందిర నిర్మాణం కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేసి, దానికి సుప్రీం తీర్పు ద్వారా పొందిన 2.77 ఎకరాల భూమిని అప్పగించి, మందిర నిర్మాణం జరుపుకోవచ్చన్నది అత్యున్నత న్యాయస్థానం విస్తృత ధర్మాసనమిచ్చిన తీర్పు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గానీ, యుపి రాష్ట్ర ప్రభుత్వం గానీ ట్రస్టును నియమించాలన్నమాట. ఏపీలో టీటీడీ వంటి ఓ ట్రస్టు అయోధ్య రామమందిరం కోసం ఏర్పాటు చేస్తే.. ఆ ట్రస్టు తీసుకునే నిర్ణయాల మేరకు రామ మందిర నిర్మాణం ప్రారంభించవచ్చు.

అయితే, తీర్పు వచ్చి రెండు నెలలు అయిన నేపథ్యంలో యుపీ ప్రభుత్వం ట్రస్టు నియామకం విషయంలో అడుగులు వేగవంతం చేసినట్లు సమాచారం. అతి త్వరలోనే ట్రస్టు ఏర్పాటు చేసి, కేంద్రం నుంచి ఆమోదం పొందితే.. ఆ తర్వాత మందిర నిర్మాణానికి సంబంధించిన పనులు అన్నీ లాంఛనాలుగానే మారతాయి. ఎందుకంటే.. మందిరం నమూనాతోపాటు.. నిర్మాణ సామాగ్రి అంతా ఆలయ ప్రదేశంలో చాలా కాలంగా వున్నాయి. మందిర నమూనాకు తుది మెరుగులు దిద్ది.. దానికి కొత్తగా ఏర్పాటయ్యే ట్రస్టు ఆమోదం పొందితే.. ఆ తర్వాత నిర్మాణ పనులకు ఏ అడ్డూ వుండదు.

ఈ తతంగాన్ని మార్చి రెండో వారం నాటికి పూర్తి చేయాలన్నది ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిమతంగా తెలుస్తోంది. దానికి తోడు 2024 పార్లమెంటు ఎన్నికలలోగా అయోధ్యలో భవ్యమైన మందిర నిర్మాణం జరగాలని బీజేపీ అధినాయకత్వం కోరుకుంటోంది. దానికి అనుగుణంగా మందిర నిర్మాణం పూర్తి కావాలంటే.. వీలైనంత త్వరగా మందిర నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి వుంది. దీని ప్రకారం తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, మార్చి 25 నుంచి ఏప్రిల్ 2వ తేదీ మధ్య ఓ శుభ ముహూర్తంలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుడతారని తెలుస్తోంది.