షీ జిన్పింగ్ బాడీ లాంగ్వేజ్పై ఆసక్తికర చర్చ.. భారత్తో సంబంధాలపై కీలక సంకేతాలా?
బ్రిక్స్ సదస్సులో షీ జిన్పింగ్ బాడీ లాంగ్వేజ్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి చైనా సానుకూల సంకేతాలు ఇస్తుందా అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వ్యాపార ప్రతినిధుల ఉనికి, చైనా మీడియా ధోరణి మార్పు దీనికి ఉదాహరణ. మోడీ-షీ భేటీ సరిహద్దు సమస్యలు, వాణిజ్య సంబంధాలపై స్పష్టతనిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

న్యూఢిల్లీ: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో ప్రపంచ దేశాల దృష్టి ఢిల్లీపై కేంద్రీకృతమైంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలువురు ప్రపంచ నాయకులు భారత్కు చేరుకున్నారు. ముఖ్యంగా షీ జిన్పింగ్ భారత పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దు వివాదం కారణంగా గత కొన్నేళ్లుగా భారత్–చైనా సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీతో షీ జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీపై ఆసక్తి నెలకొంది.
ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న షీ జిన్పింగ్కు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఆసక్తికర దృశ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షీ జిన్పింగ్ కొంతసేపు జితిన్ ప్రసాదతో మాట్లాడటం కనిపించింది. ఈ వ్యవహారాన్ని కొందరు నిపుణులు చైనా నుంచి వస్తున్న సానుకూల సంకేతంగా విశ్లేషిస్తున్నారు.
షీ బాడీ లాంగ్వేజ్ ఏం చెబుతోంది?
మాజీ దౌత్యవేత్త సుశీల్ సింఘాల్ అభిప్రాయం ప్రకారం.. షీ జిన్పింగ్ భారత పర్యటన సందర్భంగా సానుకూలమైన వాతావరణాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. చైనా నాయకత్వం నుంచి వచ్చే చిన్న చిన్న సంకేతాలు కూడా దౌత్యపరంగా ప్రాధాన్యత కలిగి ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల చైనా మీడియా, ముఖ్యంగా గ్లోబల్ టైమ్స్, భారత్పై గతంతో పోలిస్తే సానుకూల ధోరణిలో కథనాలను ప్రచురించడం కూడా గమనించాల్సిన అంశమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ వాతావరణం, భారత్పై సానుకూల వ్యాఖ్యలు వంటి పరిణామాలను కూడా సంబంధాల మెరుగుదలకు సంకేతాలుగా ఆయన అభివర్ణించారు.
వ్యాపార ప్రతినిధుల బృందంపైనా దృష్టి
షీ జిన్పింగ్ వెంట వచ్చిన ప్రతినిధి బృందంలో వ్యాపార ప్రతినిధులకు కూడా స్థానం ఉండటం ఆసక్తిని పెంచుతోంది. భారత్తో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే చైనా ఆసక్తికి ఇది సంకేతం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే భారత్ మాత్రం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ముందుకు సాగుతోందని విశ్లేషణలు చెబుతున్నాయి. సరిహద్దు సమస్యతో పాటు వాణిజ్యం, భద్రత, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
మోదీ–షీ భేటీపై ఉత్కంఠ
ఇప్పుడు అందరి దృష్టి ప్రధాని మోదీ–షీ జిన్పింగ్ ద్వైపాక్షిక సమావేశంపైనే ఉంది. ఈ భేటీలో సరిహద్దు అంశంతో పాటు భారత్–చైనా సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న దౌత్య సంకేతాలు సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ.. భారత్–చైనా సంబంధాల్లో వాస్తవిక మార్పు ఎంతవరకు వస్తుందనేది మాత్రం మోదీ–షీ భేటీ తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | Delhi: Chinese President Xi Jinping arrives in Delhi to participate in the BRICS Summit 2026.
Union MoS Jitin Prasada received him at the airport. https://t.co/fk77Bq5nmy
— ANI (@ANI) September 12, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
