లాక్‌డౌన్ నిబంధనలు మరింత సడలింపు.. వాటికి అనుమతి.. కొన్ని షరతులు..!

| Edited By: Pardhasaradhi Peri

Apr 25, 2020 | 9:55 AM

లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్రం మరింత సడలించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో షాపులు తెరిచేందుకు కేంద్రం  అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం హోంమంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.

లాక్‌డౌన్ నిబంధనలు మరింత సడలింపు.. వాటికి అనుమతి.. కొన్ని షరతులు..!
Follow us on

లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్రం మరింత సడలించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో షాపులు తెరిచేందుకు కేంద్రం  అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం హోంమంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. నిత్యావసరాలతో పాటు ఇతర వస్తువులు కూడా అమ్ముకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అలాగే రెసిడెన్షియల్, మార్కెట్‌ కాంప్లెక్స్‌ల్లో ఉన్న షాపులకు అనుమతిని ఇచ్చినట్లు తెలిపింది. అయితే షాపింగ్‌ మాల్స్‌కు సడలింపు వర్తించదని పేర్కొంది. ఈ సందర్భంగా కొన్ని షరతులను విధించింది. 50శాతం సిబ్బందితో మాత్రమే షాపులు తెరవాలని.. షాపులు తెరిచినా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని షరతు విధించింది. హాట్‌స్పాట్, కంటైన్మెంట్ జోన్స్ మినహా అన్ని ప్రాంతాలకు ఈ సడలింపు వర్తించనునట్లు కేంద్రం తెలిపింది. కాగా కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు కొనసాగించింది. అయితే ఈ నెల 20వ తేది నుంచి కొన్నింటికి మినహాయింపులు ఇస్తూ వస్తోంది కేంద్రం. ఈ క్రమంలో ఇదివరకే వ్యవసాయ సంబంధిత‌, ఎలక్ట్రికల్ షాపుల‌కు మినహాయింపు లభించిన విషయం తెలిసిందే.

Read This Story Also: 9 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌..