ఢిల్లీ మళ్ళీ కేజ్రీదే..! సీ-ఓటర్ సర్వే ఫలితమిదే!!
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీనే విజయఢంకా మోగించబోతోందని చెబుతోంది సీ-ఓటర్ సర్వే. గతంలో రికార్డు స్థాయిలో 67 సీట్లు సాధించి, అయిదేళ్ళు పాలించిన అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ సీఎం సీటును అధిరోహించబోతున్నారని చాటింది ఈ సర్వే. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా.. గత ఎన్నికల్లో 67 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. అయిదేళ్ళ పాలన తర్వాత గత అయిదారు నెలలుగా ఢిల్లీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనే ‘ఉచితాలు’ […]
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీనే విజయఢంకా మోగించబోతోందని చెబుతోంది సీ-ఓటర్ సర్వే. గతంలో రికార్డు స్థాయిలో 67 సీట్లు సాధించి, అయిదేళ్ళు పాలించిన అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ సీఎం సీటును అధిరోహించబోతున్నారని చాటింది ఈ సర్వే.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా.. గత ఎన్నికల్లో 67 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. అయిదేళ్ళ పాలన తర్వాత గత అయిదారు నెలలుగా ఢిల్లీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనే ‘ఉచితాలు’ ప్రకటిస్తూ వస్తున్న అరవింద్ కేజ్రీవాల్ వైపే ఢిల్లీ ఓటర్లు మొగ్గు చూపుతున్నారని తాజా సర్వేలో తేలింది.
ఫిబ్రవరి 8వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 59 సీట్లు సాధిస్తుందని, ప్రత్యర్థులు కనీసం ఆప్ సమీపంలోకి కూడా చేరుకోలేరని తేల్చి చెప్పింది సీ-ఓటర్ సర్వే. బీజేపీకి 8 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరిచే పరిస్థితి లేదని ఈ సర్వేలో తేలింది.
గత ఆరు నెలలుగా అనేక ఉచితాలు ప్రకటిస్తూ ఓటర్లకు తాయిలాలు వేస్తున్న అరవింద్ కేజ్రీవాల్కు తాజా సీఏఏ-ఎన్నార్సీ అంశాలు కలిసి వచ్చినట్లు క్లియర్గా తెలుస్తోంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుంటే.. 33 సీట్లలో ముస్లింల డామినేషన్ కనిపిస్తుంది. వీరి ఓట్లు గెలుపోటములను శాసించే పరిస్థితి వుంది. సీఏఏపై ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్న నిర్వహిస్తున్న విపక్షాలు.. ఢిల్లీలో కేజ్రీవాల్ నెత్తిన పాలు పోస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది.