AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Gandhi: ఫిలిబిత్‌ బీజేపీ టిక్కెట్‌పై సన్నగిల్లుతున్న ఆశలు.. పోటీ చేసి తీరుతానంటున్న వరుణ్‌

ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ వరుణ్‌గాంధీ రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌ రాకపోతే స్వతంత్ర అభ్యర్ధిగానైనా బరి లోకి దిగాలన్న ఆలోచనతో ఉన్నారట వరుణ్‌గాంధీ.

Varun Gandhi: ఫిలిబిత్‌ బీజేపీ టిక్కెట్‌పై సన్నగిల్లుతున్న ఆశలు.. పోటీ చేసి తీరుతానంటున్న వరుణ్‌
Varun Gandhi
Balaraju Goud
|

Updated on: Mar 20, 2024 | 9:27 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ వరుణ్‌గాంధీ రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌ రాకపోతే స్వతంత్ర అభ్యర్ధిగానైనా బరి లోకి దిగాలన్న ఆలోచనతో ఉన్నారట వరుణ్‌గాంధీ.

బీజేపీ టిక్కెట్‌ ఇవ్వకపోతే ఏం చేయాలన్న విషయంపై క్లారిటీతో ఉన్నారు ఆ పార్టీ ఎంపీ వరుణ్‌గాంధీ. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ నుంచి కచ్చితంగా పోటీ చేస్తానని ఆయన చెబుతున్నారు. బీజేపీ టిక్కెట్‌ ఇవ్వకపోతే సమాజ్‌వాదీ పార్టీ నుంచి లేదా ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే పార్టీలో చేరాలని సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. బీజేపీ టిక్కెట్‌ ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో 51 స్థానాలకు బీజేపీ తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించింది. మరో 24 సీట్లను ఖరారు చేయలేదు. అందులో వరుణ్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఫిలిబిత్‌, , ఆయన తల్లి మేనకా గాంధీ ఎంపీగా ఉన్న సుల్తాన్‌పుర్‌లు ఉన్నాయి. అయితే, ఈసారి మేనకా గాంధీకి సుల్తాన్‌పుర్‌ ఖరారు చేసే అవకాశం ఉన్నప్పటికీ వరుణ్‌ గాంధీకి మాత్రం మొండిచేయి చూపొచ్చనే వార్తలు వస్తున్నాయి. వరుణ్‌ స్థానంలో యూపీ మంత్రి జితిన్‌ ప్రసాద లేదా ఫిలిబిత్‌ ఎమ్మెల్యేకు చోటు కల్పించవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే.. వరుణ్‌ గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ కూడా వరుణ్‌ను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీతో పాటు యూపీ అధికార పక్షం తీరుపై వరుణ్‌ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రాహుల్‌ గాంధీని వరుణ్‌ గాంధీ కేదార్‌నాథ్‌లో కలుసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. బీజేపీకి దూరంగా ఉంటున్న వరుణ్‌ పార్టీ మారే అవకాశం ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. పిలిభిత్‌ స్థానానికి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆయన ప్రతినిధులు ఢిల్లీ నుంచి యూపీకి ఇప్పటికే తీసుకొచ్చారని పేర్కొన్నాయి. 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్‌గాంధీ పిలిభిత్‌ నుంచి పోటీ చేసి రెండోసార్లు గెలుపొందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు