AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పామును పట్టుకోమని పిలిపించారు.. అతన్ని పాము కాట్టేస్తే ఎవరూ పట్టించుకోలేదు! పైగా వీడియోలు తీశారు.. చివరికి..

వైశాలి జిల్లాకు చెందిన పాముల రక్షకుడు జె.పి.యాదవ్ గెహున్మాన్ పామును రక్షించే క్రమంలో విషపూరిత కాటుకు గురై మృతి చెందాడు. అతను పామును పట్టుకున్న తర్వాత ఆటలాడుతుండగా పాము కాటేసింది. సహాయం కోసం వేడుకున్నా ఎవరూ సహాయం చేయలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

పామును పట్టుకోమని పిలిపించారు.. అతన్ని పాము కాట్టేస్తే ఎవరూ పట్టించుకోలేదు! పైగా వీడియోలు తీశారు.. చివరికి..
Jp Yadav With Snake
SN Pasha
|

Updated on: Jul 07, 2025 | 11:59 PM

Share

బీహార్‌లోని వైశాలి జిల్లాలో పాములను రక్షించడంలో నిపుణుడైన జె.పి. యాదవ్ విషపూరిత పాము కాటు కారణంగా మరణించాడు. హాజీపూర్‌లోని చక్ సికందర్ బజార్‌లోని ఒక గిడ్డంగి నుండి విషపూరిత పామైన గెహున్మాన్‌ను రక్షించడానికి యాదవ్‌ను పిలిచారు. అతను గిడ్డంగిలో పామును పట్టుకున్నాడు. దాన్ని బహిరంగ ప్రదేశంలో బయటకు తీసుకువచ్చాడు. జె.పి. యాదవ్ పాముతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ విషపూరిత పాము అతన్ని చాలాసార్లు కాటేయడానికి ప్రయత్నించింది, కానీ అతను తప్పించుకున్నాడు.

జె.పి. తన చేతిలో ఉన్న పాముతో ఆడుకుంటుండగా, ఆ పాము వెనక్కి తిరిగి అతని వేలిపై కాటేసింది. ఆ తర్వాత అతను మందు కోసం పిలుస్తూనే ఉన్నాడు, తన మణికట్టును కట్టమని వేడుకుంటూనే ఉన్నాడు, కానీ జనసమూహంలో ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. పాము అతన్ని కరిచిన తర్వాత కూడా జె.పి. యాదవ్ పామును పట్టుకుంటూనే ఉన్నాడు.

పామును ఒక పెట్టెలో వేస్తుండగా విషం అతని శరీరంలోకి వ్యాపించింది. సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తూనే ఉన్నారు, కానీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. సమీపంలో నిలబడి ఉన్న పోలీసులు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కొంత సమయం తర్వాత స్థానికులు అతన్ని హడావిడిగా హాజీపూర్ సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉండటం చూసి, మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. పాపం యాదవ్‌ అప్పటికే మరణించాడు. పాములు పట్టుకోవడానికి జెపి చాలా దూరం వెళ్ళేవాడు. ఇప్పటివరకు వందలాది విషపు పాములను రక్షించాడు. ఒక పాము నుండి మరొకరి ప్రాణాన్ని కాపాడుతూ అతనే మరణించాడు. జెపి యాదవ్ ఒక రైతు. జెపికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి