భార్యను నాలుగు సార్లు కాల్చి చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భర్త.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

బెంగళూరులో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం (డిసెంబర్ 23) సాయంత్రం 40 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్యను కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆ ఇంజనీర్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.

భార్యను నాలుగు సార్లు కాల్చి చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భర్త.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?
Bengaluru Techie Shoots Wife

Updated on: Dec 24, 2025 | 11:18 AM

బెంగళూరులో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం (డిసెంబర్ 23) సాయంత్రం 40 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్యను కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆ ఇంజనీర్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.

బాధితురాలు భువనేశ్వరి (39) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బసవేశ్వరనగర్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె పని నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, సాయంత్రం మాగడి రోడ్డు సమీపంలో నిందితుడు బాలమురుగన్ ఆమెను అడ్డగించాడు. అతను పిస్టల్‌తో దగ్గరి నుండి నాలుగు సార్లు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను షాన్‌బాగ్ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడికి చేరుకునేలోపే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

2011లో భువనేశ్వరితో బాలమురుగన్‌కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరిద్దరూ తమిళనాడులోని సేలం జిల్లా నివాసితులు. ఉద్యోగరిత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. ఈ జంట గత 18 నెలలుగా వైవాహిక జీవితంలో విబేధాలు రావడంతో విడివిడిగా నివసిస్తున్నారు. నిందితుడికి తన భార్య వ్యక్తిత్వంపై అనుమానం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె నుండి దూరం కావడానికి ప్రయత్నిస్తూ, భువనేశ్వరి ఆరు నెలల క్రితం వైట్‌ఫీల్డ్ నుండి రాజాజీనగర్‌కు వెళ్లాడు. అయితే, బాలమురుగన్ ఆమెను వెతికి పట్టుకుని, ఆమెపై నిఘా ఉంచడానికి నాలుగు నెలల క్రితం కెపి అగ్రహార పోలీసు పరిధిలోని చోళుర్‌పాళ్యకు వెళ్లాడు.

వారం క్రితం, అతను భువనేశ్వరికి విడాకులు కోరుతూ లీగల్ నోటీసు పంపాడు. వెస్ట్ డివిజన్ డిసిపి ఎస్. గిరీష్ ప్రకారం, నిందితుడు గతంలో ఒక ప్రైవేట్ ఐటి సంస్థలో పనిచేశాడు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా నిరుద్యోగిగా ఉన్నాడు. కాగా, భువనేశ్వరిపై దాడికి పాల్పడ్డ బాలమురుగన్, మాగడి రోడ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, నేరాన్ని అంగీకరించాడు. ఆయుధాన్ని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఐపిసి సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..