AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Software Suicide: విచిత్రమైన రీతిలో సాఫ్ట్‌వేర్‌ సూసైడ్‌.. కారును బెడ్‌షీట్‌తో కప్పి, ముఖానికి పాలిథిన్ కవర్ చుట్టి

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇంజనీర్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. హుటాహుటినా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

Software Suicide: విచిత్రమైన రీతిలో సాఫ్ట్‌వేర్‌ సూసైడ్‌.. కారును బెడ్‌షీట్‌తో కప్పి, ముఖానికి పాలిథిన్ కవర్ చుట్టి
Software Suicide
Jyothi Gadda
|

Updated on: Dec 21, 2022 | 7:32 PM

Share

బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విచిత్రమైన రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయ్ కుమార్ (51) కారులో శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకోవటం కోసం ఒక విచిత్రమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. సూసైడ్‌ చేసుకోవాలని డిసైడ్‌ అయిన తర్వాత ముందుగా నైట్రోజన్ సిలిండర్ కొన్నాడు. ఆ సిలిండర్‌ తన కారులో పెట్టుకున్నాడు. ఆ కారుపై పూర్తిగా బెడ్‌షీట్‌తో కప్పేశాడు. ఆ తరువాత కారు వెనుక సీటులో కూర్చున్నాడు. ముఖం పూర్తిగా కవర్‌ అయ్యేలా మెడకు పాలిథిన్ కవర్ చుట్టి పైపును సిలిండర్ కు కనెక్ట్ చేసి పాలిథిన్ కవర్ లోపల పెట్టుకున్నాడు.

విషయం తెలుసుకున్న స్థానికులు మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇంజనీర్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. హుటాహుటినా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

విజయ్‌ కుమార్‌ తీవ్ర గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు. మరణాన్ని ఎదుర్కొంటున్న తన కుటుంబ సభ్యుల గురించి తన వేదనను పంచుకున్నారు. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్‌లోని కురుబరహళ్లి జంక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు కూడా మహాలక్ష్మి లేఅవుట్ నివాసిగా గుర్తించారు పోలీసులు. UDR కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో పోలీసులు అసహజ మరణ నివేదిక (యుడిఆర్) కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, గతంలో కర్ణాటకలో మరో ఆత్మహత్య ఉదంతం కూడా తెరపైకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలోని బాసర్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (RGUKT) విద్యార్థి డిసెంబర్ 18 రాత్రి తన క్యాంపస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 17 ఏళ్ల విద్యార్థి భాను ప్రసాద్ మాత్రమే RGUKT నుండి చదువుతున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాన్ని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. మానసిక సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలిపారు. భాను తనకు ఒసిడి (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఉందని అంగీకరించాడు. ఈ వ్యాధి అతనిని ఎంతగా వేధించింది అంటే అతను చదువు కూడా సాగించలేకపోతున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి