AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత పనిచేశావ్ తల్లి.. స్కూల్లో టీచర్ల వేధింపులు తట్టుకోలేక గుండెపగిలే నిర్ణయం..

ఒక చిన్న కారణం.. తోటి పిల్లల వేలెత్తి చూపడం.. స్కూల్ టీచర్ల వరుస ప్రశ్నలు.. ఆ విద్యార్థినిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు వాటిని అవమనంగా భావించిన విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బెంగళూరు అర్బన్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. అసలేం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఎంత పనిచేశావ్ తల్లి.. స్కూల్లో టీచర్ల వేధింపులు తట్టుకోలేక గుండెపగిలే నిర్ణయం..
Bengaluru Schoolgirl Ends Life
Krishna S
|

Updated on: Jul 11, 2026 | 10:11 AM

Share

స్కూల్లో జరిగిన ఒక చిన్న ఘటన, ఆపై ఉపాధ్యాయుల విచారణ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెంగళూరు అర్బన్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థిని గురువారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. స్కూల్ యాజమాన్యం వేధించడం వల్లే తన కూతురు బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సదరు విద్యార్థిని, ఆమెతో పాటు మరికొందరు సహచర విద్యార్థులు కలిసి ఓ టీచర్‌కు ముద్దుపేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థినులను పిలిచి విచారించారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ఆ బాలికే ఈ పని చేసిందని వేలెత్తి చూపించారు. దీంతో స్కూల్ అధికారులు మంగళవారం నుండి గురువారం వరకు వరుసగా మూడు రోజుల పాటు ఆ బాలికను తీవ్రంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఇంట్లో ఆత్మహత్య

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక గురువారం స్కూల్ నుండి వచ్చాక ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించే సరికి ఆమె మృతి చెంది ఉంది. పాఠశాలలో జరిగిన ఘటనపై మూడు రోజుల పాటు వరుసగా విచారించడంతో ఆ బాలిక తీవ్రమైన అవమాన భారానికి లోనైనట్లు ఆమె రాసిన సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోందిని పోలీసులు వెల్లడించారు.

ఆ ఆరోపణలు అబద్ధం

హోమ్‌వర్క్ చేయని విద్యార్థుల నుండి పాఠశాలలో రూ.10 లేదా రూ.20 జరిమానా వసూలు చేసే అలవాటు ఉందని.. తనకు సైతం రూ.20 ఫైన్ విధించినట్లు బాలిక డెత్ నోట్‌లో రాసినట్లు పోలీసలు వెల్లడించారు. అయితే టీచర్లు ముద్దుపేరు ఘటనకు సంబంధించి తీవ్రంగా ప్రశ్నించడంతోనే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

విచారణ జరుపుతున్న పోలీసులు

బాధిత బాలిక తల్లి మాట్లాడుతూ.. ‘‘స్కూల్లో టీచర్లు నా బిడ్డను వేధించారని తెలిసింది. కానీ ఏ టీచర్, అసలేం జరిగిందనేది నాకు పూర్తిగా తెలియదు” అని కన్నీరుమున్నీరయ్యారు. కాగా ఈ ఘటనపై స్థానిక విద్యాశాఖ అధికారి గురుమూర్తి పాఠశాలను సందర్శించి శాఖాపరమైన విచారణ చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, తోటి విద్యార్థులు, స్కూల్ సిబ్బంది స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు.

Follow Us
ఎంత పనిచేశావ్ తల్లి.. స్కూల్లో టీచర్ల వేధింపులు తట్టుకోలేక ..
ఎంత పనిచేశావ్ తల్లి.. స్కూల్లో టీచర్ల వేధింపులు తట్టుకోలేక ..
యుద్ధ స్వరూపం మారుతోంది : రాజ్‌నాథ్ సింగ్
యుద్ధ స్వరూపం మారుతోంది : రాజ్‌నాథ్ సింగ్
కేవలం 35 రోజుల్లోనే కోతకు పచ్చి మేత.. ఆవులు, గేదెలకు ఎంతో ఇష్టం
కేవలం 35 రోజుల్లోనే కోతకు పచ్చి మేత.. ఆవులు, గేదెలకు ఎంతో ఇష్టం
తెలంగాణ స్టైల్ ముద్దపప్పు చారు.. ఇలా చేస్తే వదేళ్లు గుర్తుంటుంది!
తెలంగాణ స్టైల్ ముద్దపప్పు చారు.. ఇలా చేస్తే వదేళ్లు గుర్తుంటుంది!
ఆ ముగ్గురు లేకపోతే గెలవడం మీ వల్ల కాదా గంభీర్..?
ఆ ముగ్గురు లేకపోతే గెలవడం మీ వల్ల కాదా గంభీర్..?
ఆ నంబర్ సిరీస్‌తో వచ్చే కాల్స్‌ను బ్లాక్ చేయడం సాధ్యం కాదు: TRAI
ఆ నంబర్ సిరీస్‌తో వచ్చే కాల్స్‌ను బ్లాక్ చేయడం సాధ్యం కాదు: TRAI
ఆషాఢం అమావాస్య.. వీరికి ఏది చేసినా అంతా మంచే!
ఆషాఢం అమావాస్య.. వీరికి ఏది చేసినా అంతా మంచే!
జాతీయ గీతం, జాతీయ గేయం ఆలాపనపై కేంద్రం తాజా ఆదేశాలు ఇవే
జాతీయ గీతం, జాతీయ గేయం ఆలాపనపై కేంద్రం తాజా ఆదేశాలు ఇవే
బంగారం ధరలా దూసుకెళ్తున్న ఈ కూరగాయ.. మార్కెట్లో ఎందుకింత క్రేజ్?
బంగారం ధరలా దూసుకెళ్తున్న ఈ కూరగాయ.. మార్కెట్లో ఎందుకింత క్రేజ్?
విమానం గాల్లో ఉండగా పగిలిన కిటికీ.. ప్రయాణికుడిని లాగేసిన గాలి
విమానం గాల్లో ఉండగా పగిలిన కిటికీ.. ప్రయాణికుడిని లాగేసిన గాలి