AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pema Khandu: రికార్డు సృష్టించిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి.. ఏ సీఎం చేయని సాహాసం చేసిన పెమా ఖండు.. వీడియో

CM Pema Khandu road journey: అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖాండు రికార్డ్ సృష్టించారు. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి కూడా చేరుకోని.. మారుమూల కొండ ప్రాంతానికి ఆయన వెళ్లి అందరి మన్ననలు పొందుతున్నారు. దాదాపు రెండురోజుల పాటు 157

Pema Khandu: రికార్డు సృష్టించిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి.. ఏ సీఎం చేయని సాహాసం చేసిన పెమా ఖండు.. వీడియో
Pema Khandu Road Journey
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Mar 29, 2021 | 6:12 AM

Share

CM Pema Khandu road journey: అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖాండు రికార్డ్ సృష్టించారు. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి కూడా చేరుకోని.. మారుమూల కొండ ప్రాంతానికి ఆయన వెళ్లి అందరి మన్ననలు పొందుతున్నారు. దాదాపు రెండురోజుల పాటు 157 కిలోమీటర్లు ప్రయాణించి చాంగ్ లాంగ్ జిల్లాలోని మయన్మార్ సరిహద్దు ప్రాంతం విజయనగర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పెమాఖండు.. అడవులు, కొండలు కొనల మార్గంలో బురద, మట్టిరోడ్డుపై స్వయంగా కారు నడిపారు. రాత్రివేళ అడవిలో చెట్ల కిందే సెక్యూరిటీతో విశ్రాంతి తీసుకున్నారు. అయితే సీఎం సాహసానికి పలువురు ప్రశంసిస్తున్నారు. ఏ సీఎం చేరుకోని ప్రాంతానికి.. పెమాఖండు సహాసం చేసి వెళ్లారంటూ కొనియాడుతున్నారు. అయితే సీఎం జర్నీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సీఎం స్వయంగా ట్విట్ చేశారు. ఈ సహాసం చేసి రోడ్డు మార్గం ద్వారా చాంగ్లాంగ్ జిల్లాలోని విజయనగర్ చేరుకున్న మొదటి సిఎంగా పెమాఖండు నిలిచారు.

ఈ ప్రయాణంలో ఆయన వెంట క్యాబినెట్ మంత్రులు కమ్లుంగ్ మొసాంగ్, హోంచన్, పలువురు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. అక్కడకు చేరుకున్న సీఎం పెమాఖండు విజయనగర్ ప్రాంత వాసులకు వరాలజల్లు కురిపించారు. ఈ ప్రాంతానికి రోడ్డు నిర్మిస్తానని వెల్లడించారు. రహదారి నాణ్యతను అంచనా వేయడానికి ఈ ప్రయాణం చేపట్టానన్నారు. 2022 మార్చి నాటికి రోడ్డు మార్గాన్ని రూపొందిస్తాని తెలిపారు. నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసేందుకు తాను వ్యక్తిగతంగా ఈ ప్రయాణాన్ని చేపట్టినట్లు సీఎం వెల్లడించారు. ఈ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనతోపాటు.. పర్యాటక రంగం అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. దీంతోపాటు ఆయన గాంధీగ్రామ్‌లో కూడా పర్యటించారు. 25వ తేదీన బయలుదేరిన సీఎం.. మొత్తం మూడు రోజులపాటు పర్యటించారు. ఈ పర్యటనపై అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా పెమాఖండును అభినందించారు.

Also Read:

IND vs ENG 3rd ODI: వన్డే సిరీస్‌ కూడా భారత్‌దే.. చివరి వన్డేలో ఇంగ్లాండ్‌పై ఘన విజయం‌

Supreme Court: విడాకులిచ్చిన భర్తకు సుప్రీం షాక్.. రూ.2.60 కోట్ల భరణం చెల్లించాలని ఆదేశాలు.. లేకపోతే..

Follow Us
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..